Natyam: ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటిస్తూ.. తానే స్వయంగా నిర్సించిన సినిమా నాట్యం. నిశృంకళ ఫిల్మ్ పతాకంపై రేవత్ కరుకొండ దర్శకత్వంలో తెరెక్కిన ఈ సినిమా అక్టోబరు 22న విడుదలైంది. ఈ సందర్భంగా నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ సినిమాను వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బాలయ్య..సినిమా అద్భుతంగా ఉందని అన్నారు. మరుగున పడుతున్న కళకు తిరిగి ప్రాణం పోసి.. వాటిని తెరపైకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. ఈ నాట్యం కేవలం సినిమా కాదని..ఒక కళాఖండమని కొనియాడారు. సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదని దాని వెనక ఒక సందేశం దాగి ఉంటుందని తెలిపారు. ఈ సినిమాలో నాట్యానికి ప్రాణం పోసి.. భావితరాలకు అందించిన ఘనత సంధ్యారాజుకు దక్కుతుందని బాలయ్య అన్నారు.
అనంతరం దర్శకుడు రేవంత్ గురించి మాట్లాడిన బాలకృష్ణ. సినిమాకు తానే కెమెరామెన్, దర్శకుడు, ఎడిటర్గా వ్యవహరించి అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసలు కురిపించారు. ఒక్కో సన్నివేశాన్ని చక్కగా చిత్రీకరించారని అన్నారు. ఎన్నిసార్లు చూసినా ఈ సినిమా తనివితీరనిదని కొనియాడారు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరూ అద్భుతంగా తమ తమ పాత్రల్లో నటించారని బాలకృష్ణ అన్నారు.
మరోవైపు అఖండ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు బాలయ్య.. దీంతో పాటు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా వేదికగా అన్స్టాపబుల్ అనే ఓ టాక్షోకు హోస్ట్గా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవలే ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. బాలయ్య హోస్ట్ అనగానే అటు సినీ ప్రియులతో పాటు, చిత్రసీమలోనూ ఆసక్తి నెలకొంది. తన కెరీర్లో తొలిసారి హోస్ట్గా బాలయ్య కనిపించడం విశేషం.