ధనుష్ డ్రీమ్ ప్రాజెక్టులో నాగార్జున కీ రోల్?

ప్రయోగాలు చేయడంలో, కొత్త దర్శకులతో సినిమాలు చేయడంలో నాగార్జున ఎప్పుడూ ముందుంటాడు. ఎప్పుడూ భిన్నమైన కథల కోసం పరితపిస్తుంటాడు. సీనియర్ హీరో అయినప్పటికీ కథ డిమాండ్ చేస్తే మల్టీస్టారర్ సినిమాలు కూడా చేస్తుంటాడు. తెలుగులోనే కాకుండా.. హిందీలో కూడా నాగ్‌ పలు మల్టీస్టారర్స్‌ చేశాడు. రీసెంట్‌గా నానితో కలిసి దేవదాస్‌లో నటించాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో అమితాబ్‌ బచ్చన్, రణ్‌బీర్ కపూర్లతో కలిసి ‘బ్రహ్మాస్త్ర’లో యాక్ట్‌ చేస్తున్నాడు. తాజాగా నాగ్‌ మరో మల్టీస్టారర్ కు కూడా గ్రీన్‌ సిన్నల్‌ […]

Written By: admin, Updated On : June 10, 2020 6:53 pm
Follow us on


ప్రయోగాలు చేయడంలో, కొత్త దర్శకులతో సినిమాలు చేయడంలో నాగార్జున ఎప్పుడూ ముందుంటాడు. ఎప్పుడూ భిన్నమైన కథల కోసం పరితపిస్తుంటాడు. సీనియర్ హీరో అయినప్పటికీ కథ డిమాండ్ చేస్తే మల్టీస్టారర్ సినిమాలు కూడా చేస్తుంటాడు. తెలుగులోనే కాకుండా.. హిందీలో కూడా నాగ్‌ పలు మల్టీస్టారర్స్‌ చేశాడు. రీసెంట్‌గా నానితో కలిసి దేవదాస్‌లో నటించాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో అమితాబ్‌ బచ్చన్, రణ్‌బీర్ కపూర్లతో కలిసి ‘బ్రహ్మాస్త్ర’లో యాక్ట్‌ చేస్తున్నాడు. తాజాగా నాగ్‌ మరో మల్టీస్టారర్ కు కూడా గ్రీన్‌ సిన్నల్‌ ఇచ్చినట్టు సమచారం. ఇది తమిళ చిత్రం కావడం విశేషం. దీనికి తమిళ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహించనున్నాడు.

ధనుష్ డ్రీమ్‌ ప్రాజెక్ట్ అయిన ఈ మూవీలో నాగార్జున కీలక పాత్ర పోషించనున్నట్టు సమాచారం. ముందుగా ఆ పాత్రకు ధనుష్ తన మావయ్య, సూపర్ స్టార్ రజనీ కాంత్‌ను అనుకున్నాడట. కానీ, ఇప్పటికే ఉన్న కమిట్మెంట్ల వల్ల రజనీ ఈ మూవీకి డేట్స్‌ కేటాయించే అవకాశం లేకపోవడంతో నాగ్‌ను సంప్రదించినట్టు సమాచారం. కథ, తన పాత్ర నచ్చడంతో నాగార్జున వెంటనే ఓకే చెప్పాడట. ఇదంతా జరిగి ఏడాది అయిందట. ఈ మూవీకి ధనుష్ ‘రుద్ర’ అనే టైటిల్ కూడా ఖరారు చేశాడు. కానీ, తన బిజీ షెడ్యూల్ కారణంగా ఈ మూవీని ముందుకు తీసుకెళ్లలేకపోయాడు. అయితే, ఇప్పుడు కరోనా కారణంగా విరామం లభించడంతో ‘రుద్ర’ స్క్రిప్ట్‌పై ధనుష్ మళ్లీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. తాను ఓకే చెప్పిన సినిమాలు ముగిసిన వెంటనే దీన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లాలని ప్లాన్‌ చేస్తున్నాడట. ఇదే విషయాన్ని నాగ్‌కు చెప్పినట్టు సమాచారం. ఈ మూవీలో నాగ్‌తో అదితీరావు హైదరీ, శరత్ కుమార్, ఎస్‌జే సూర్య కూడా కీలక పాత్రల్లో నటించనున్నారు.