
అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తోన్న సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’. అయితే ఈ సినిమా అవుట్ ఫుట్ పట్ల నాగ్ అసంతృప్తిగా ఫీల్ అయినట్లు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఇవి కేవలం రూమర్స్ అని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోన్న సంగతి తెలిసిందే. అఖిల్ – పూజా హెగ్డేల మధ్య కొన్ని లవ్ సీన్స్ చాల బాగా వచ్చాయట. ఈ సీన్స్ సినిమాలోనే హైలైట్ గా నిలుస్తాయట. ఇక ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలో లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు లవ్ స్టోరీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందట.
కాగా అఖిల్ గత సినిమా ‘మిస్టర్ మజ్ను’ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది అక్కినేని అఖిల్ కి. దాంతో ఈ సినిమా పై మరింత జాగ్రత్త పడుతున్నాడు అఖిల్. బొమ్మరిల్లు భాస్కర్ తో పాటు అఖిల్ కూడా దగ్గర ఉండి ఈ సినిమాకి సంబంధించి అన్ని పనులు చూసుకుంటున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కీలక షెడ్యూల్స్ అన్ని కూడా పూర్తి అయ్యాయి.
ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నే నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్నారు. మరి భాస్కర్ తో చెయ్యబోయే సినిమాతోనైనా అఖిల్ భారీ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి. అలాగే రమేష్ అనె ఓ కొత్త డైరెక్టర్ కథను అఖిల్ ఓకే చేశారట. కరోనా ప్రభావం తగ్గాక ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళటానికి చూస్తున్నారు. అన్నట్లు ఈ సినిమాకి నాగార్జున నిర్మాతగా వ్యవహరించనున్నారు.