Jayalalithaa: మాజీ సీఎం, స్టార్ హీరో.. ఇద్దరు కాదనడంతో ఒంటరిగా మిగిలిపోయిన స్టార్ హీరోయిన్

సినిమా, రాజకీయ జీవితం మాత్రమే కాదు ప్రేమ వ్యవహారాలతో కూడా వార్తల్లో నిలిచింది. అయితే ఈమె శోభన్ బాబు, ఎంజీ రామచంద్రన్ అనే ఇద్దరిని ప్రేమించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. సౌత్ సినీ ప్రముఖ నటుడు శోభన్ బాబును జయలలిత ఒక సినిమా పార్టీలో కలిశారట.

Written By: Swathi, Updated On : February 22, 2024 1:52 pm
Follow us on

Jayalalithaa: పెళ్లి చేసుకోవాలంటే మనుషులు ఉంటే మాత్రమే సరిపోదు. మనసు కూడా ఉండాలంటారు కొందరు. మనసులో ఉన్నవారిని మాత్రమే చేసుకోవాలి అనుకుంటారు మరికొందరు. మరి ఇదే కోవకు చెందుతుందట మాజీ ముఖ్యమంత్రి జయలలిత. ఈమె 1965లో వెన్నిర ఆడై అనే బ్లాక్ బస్టర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. అలాంటి ఈమె లైఫ్ లో ఉన్నో ట్విస్టులు. ఇక ఆ తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆరుసార్లు పగ్గాలు చేపట్టింది. 1961, 1980 మధ్య 140 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గానే కాకుండా హీరోయిన్ గా నటించింది.

సినిమా, రాజకీయ జీవితం మాత్రమే కాదు ప్రేమ వ్యవహారాలతో కూడా వార్తల్లో నిలిచింది. అయితే ఈమె శోభన్ బాబు, ఎంజీ రామచంద్రన్ అనే ఇద్దరిని ప్రేమించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. సౌత్ సినీ ప్రముఖ నటుడు శోభన్ బాబును జయలలిత ఒక సినిమా పార్టీలో కలిశారట. ఈయన తన భార్య, పిల్లలతో కలిసి చెన్నైలో ఉండేవారట. ఆయనకు పెళ్లైందని తెలిసినా కూడా అతనితో ప్రేమలో పడిందట ఈ నటి. అంతేకాదు ఇద్దరు కలిసి చాలా సార్లు కెమెరాకు చిక్కారట కూడా. ఇద్దరి మధ్య సానిహిత్యం ఉందంటూ వార్తలు వచ్చాయి కూడా.

అయితే ఒకరోజు తనను పెళ్లి చేసుకోవాలని జయలలిత కోరితే.. భార్య పిల్లల వల్ల శోభన్ బాబు రిజక్ట్ చేశారని టాక్. దీంతో ఆయనకు దూరం అయింది ఈ హీరోయిన్. 28 హిట్ చిత్రాలను అందించిన ఎమ్ జీ ఆర్ కోరికతో చిత్ర పరిశ్రమను వదిలి రాజకీయాల్లోకి ప్రవేశించింది. ఇద్దరి మధ్య చాలా గాఢమైన సంబంధం ఉండేదట. జయలలిత ధైర్యం కూడగట్టుకుని ఎంజీఆర్ తో పెళ్లికి ప్రపోజ్ చేసినప్పుడు రెండో భార్య కారణంగా ఆయన కూడా ఆమెను అంగీకరించలేక పోయారని టాక్. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు.

ఇలా మొత్తం మీద తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పిన జయలలిత శోభన్ బాబు, ఎంజీఆర్ లు రిజక్ట్ చేయడంతో ఇద్దరిని పెళ్లి చేసుకోకుండా అలాగే కన్యగా మిగిలిపోయింది. ఎవరిని పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడంతో అప్పట్లో ఇవే వార్తలు గుప్పుమన్నాయి.