Nageshwar Reddy Nagarjuna Movie: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోతో సినిమా చేయడానికి మరొక హీరోతో వచ్చిన అవకాశాన్ని కోల్పోయిన దర్శకులు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా కొంతమంది హీరోల మధ్య ఉన్న ఈగో ల వల్ల ఆ హీరోతో సినిమా చేసిన దర్శకుడు నాతో సినిమా చేయడమేంటి అంటూ సినిమాలను క్యాన్సిల్ చేసిన హీరోలు కూడా ఉన్నారు. ఇలా కొంతమంది దర్శకులు స్టార్ హీరోలతో ఆఫర్ వచ్చిన కూడా వాళ్ల ఛాన్స్ లను మిస్ చేసుకున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన నాగేశ్వర్ రెడ్డి గత 25 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్నాడు. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన ఎలిమెంట్ ఉండడమే కాకుండా దానిని మొత్తం కామెడీతో చుట్టేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన ‘సీమాటపాకాయ్’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. దాంతో నాగార్జున నుంచి ఆయనకి ఒక ఆఫర్ వచ్చిందట. నాగార్జున రాజన్న సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు రామోజీ ఫిలిం సిటీకి నాగేశ్వర్ రెడ్డి ని పిలిచి ఒక కథ చెప్పమని అడిగారట. దానికి ఆయన కొన్ని రోజుల పాటు సమయాన్ని తీసుకొని మరి కథ రెడీ చేసి పెట్టుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే అతను అప్పుడే మంచు విష్ణుతో ‘దేనికైనా రెడీ’ అనే సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. స్క్రిప్ట్ డిస్కషన్ లో భాగంగా మోహన్ బాబు సిట్టింగ్ లో కూర్చోవలసి వచ్చిందట. అప్పటికే విష్ణు తో ఇలా నాగార్జునతో మీటింగ్ ఉందని కూడా చెప్పాడట. నాగార్జునకు సోమవారం రోజునా కలుస్తానని చెప్పాడట. ఇక ఆ సోమవారం రానే వచ్చింది. మోహన్ బాబుది స్క్రిప్ట్ డిస్కషన్ లో కూర్చున్న నాగేశ్వర్ రెడ్డి సోమవారం 11 గంటలకు నాగార్జున తో మీటింగ్ కి అటెండ్ అవ్వాలి. అలాంటిది అతను నాగార్జునతో చేయాల్సిన సినిమాకు సంబంధించిన పూర్తి కథ రెడీ చేసి పెట్టుకున్నారట. ఇక ఇక్కడ లేటవుతుందని గమనించిన నాగేశ్వర్ రెడ్డి నాగార్జునతో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న ప్రొడ్యూసర్ శివప్రసాద్ రెడ్డి వల్ల కొడుక్కికి ఫోన్ చేసి 11 గంటలకు నాగార్జున గారిని కలుస్తానని చెప్పాను. మూడు గంటలకు మీటింగ్ పెట్టే ప్రయత్నం చేయండి అని చెప్పారట. ఆయన నేను నాగార్జునతో మాట్లాడుతానని చెప్పాడట. ఇక తనే ఫోన్ చేసి ఈరోజు మీటింగ్ కుదరదు.
రేపు మాట్లాడదాం అన్నారు అని చెప్పడంతో ఆయన కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు. ఇక నెక్స్ట్ డే అన్నపూర్ణ స్టూడియోస్ కి నాగేశ్వర్ రెడ్డి వెళ్లారట. సినిమా షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో అప్పుడే ఆ సినిమా షాట్ గ్యాప్ లో నాగార్జున వచ్చి నాగేశ్వర్ రెడ్డిని కలిశారట. రోజు నాకు 10 మంది కథలు చెప్పడానికి వస్తారు. అలాంటిది నేను నిన్ను పిలిచి కథ చెప్పమంటే 11 గంటలకు వస్తానని చెప్పావు. అలాంటిది నేను అన్నపూర్ణ స్టూడియోలోకి వచ్చి 11 నుంచి 2 గంటల వరకు నీకోసం వెయిట్ చేస్తూనే ఉన్నాను.
అయిన కూడా నువ్వు నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇక్కడ వెయిట్ చేయించావని చెప్పారట. మొత్తానికైతే అప్పుడే మోహన్ బాబు నాగార్జునకి ఫోన్ చేసి నాగేశ్వర్ రెడ్డి తో నాకు డిస్కషన్ ఉందని చెప్పారట. నాగార్జున సైతం మోహన్ బాబు తో నీకు డిస్కషన్ ఉందంట కదా అని నాగేశ్వర్ రెడ్డి ని అడిగాడట. దాంతో నాగేశ్వర్ రెడ్డి అవును సార్ అక్కడి నుంచే వస్తున్నానని చెప్పారట.
ముందు మోహన్ బాబు సినిమా సంగతి అయితే చూడు ఆయన మామూలోడు కాదు కోపానికి వస్తాడు. ఆయన సినిమా తర్వాత మనం చేద్దామని చెప్పాడట. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు నాగేశ్వర్ రెడ్డి చాలాసార్లు కథ చెప్పాలనే ప్రయత్నం చేసిన కూడా నాగార్జున వినడానికి ఇంట్రెస్ట్ చూపించలేదట. ఇలా మోహన్ బాబు సినిమా చేయడం వల్ల తనకు నాగార్జునతో సినిమా చేసే అవకాశం పోయింది అంటూ నాగేశ్వర్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం…
