Balakrishna:  ‘బాలకృష్ణ’ స్వర్ణోత్సవ వేడుకలకు అతిథిగా మెగాస్టార్ చిరంజీవి..మెగా – నందమూరి అభిమానులకు ఇక పండగే!

బాలయ్య బాబు 50 సంవత్సరాలు ఇండస్ట్రీ లో పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 1 వ తేదీన తెలుగు సినీ పరిశ్రమ ఆద్వర్యం లో హైదరాబాద్ లోని హైటెక్స్ నోవాటెల్ హోటల్ లో గ్రాండ్ గా ఒక ఈవెంట్ ని చెయ్యబోతున్నారు. ఈ ఈవెంట్ కి తెలుగు సినీ ప్రంహులందరికీ ఆహ్వానం దక్కింది. మెగా స్టార్ చిరంజీవి కి కూడా ప్రత్యేకించి ఆహ్వానం దక్కింది.

Written By: Vicky, Updated On : August 20, 2024 5:04 pm

Balakrishna's Golden Jubilee celebrations

Follow us on

Balakrishna : మహానటుడు ఎన్టీఆర్ నటవారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిలో ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలను పోషిస్తూ తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. మాస్ అనే పదానికి పర్యాయపదం లాగా బాలయ్య నిలిచాడు. ఫ్యాక్షన్ సినిమాలైనా, పౌరాణిక సినిమాలైనా, ప్రయోగాలు చేయడం లోనైనా బాలయ్యకి సాటి ఎవరూ రారు. ముఖ్యంగా ఆయన డైలాగ్ డెలివరీ ముందు ఎంతటి మహానటుడైనా డామినేట్ అవ్వాల్సిందే. ఇండస్ట్రీ లో బాలయ్య బాబు తప్ప ఎవ్వరూ చెయ్యలేరు అనే పాత్రలు ఎన్నో ఉన్నాయి. అలా ఎంతో వైభోగంగా సాగుతూ ముందుకు పోతున్న బాలయ్య సినీ కెరీర్, అప్పుడే 50 వసంతాలు పూర్తి చేసుకుంది.

1974 వ సంవత్సరం లో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘తాతమ్మ కల’ అనే చిత్రం ద్వారా బాలనటుడిగా బాలకృష్ణ మొదటిసారి కెమెరా ని ఎదురుకున్నాడు. ఈ చిత్రానికి ఎన్టీఆర్ దర్శకత్వం కూడా వహించడం విశేషం. అలా మొదటి సినిమానే తండ్రి దర్శకత్వం లో నటించే బంగారం లాంటి అవకాశం బాలకృష్ణ కి దక్కింది. అందుకే ఆయన కెరీర్ ఇలా వెలిగిపోతుంది అని చెప్పొచ్చు. 60 ఏళ్ళ వయసు పైబడినా కూడా కుర్ర హీరోలతో సమానంగా పోటీ పడుతూ బాలయ్య ఇప్పటికీ సినిమాలు చేస్తున్నాడు, రికార్డ్స్ కొడుతూనే ఉన్నాడు. అయితే బాలయ్య బాబు 50 సంవత్సరాలు ఇండస్ట్రీ లో పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 1 వ తేదీన తెలుగు సినీ పరిశ్రమ ఆద్వర్యం లో హైదరాబాద్ లోని హైటెక్స్ నోవాటెల్ హోటల్ లో గ్రాండ్ గా ఒక ఈవెంట్ ని చెయ్యబోతున్నారు. ఈ ఈవెంట్ కి తెలుగు సినీ ప్రంహులందరికీ ఆహ్వానం దక్కింది. మెగా స్టార్ చిరంజీవి కి కూడా ప్రత్యేకించి ఆహ్వానం దక్కింది. ఆయన కూడా ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు సుముఖుత చూపించినట్టు తెలుస్తుంది. చిరంజీవి, బాలకృష్ణ మధ్య బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ విషయంలో ఏ స్థాయి పోటీ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ ఎంత పోటీ తత్త్వం ఉన్నప్పటికీ కూడా, ఇద్దరు ఒకప్పుడు ఎంతో స్నేహంగా ఉండేవారు. కానీ ఈమధ్య కాలం లో వీళ్లిద్దరి మధ్య కాస్త గ్యాప్ పెరిగింది.

బాలయ్య బాబు ఎన్నోసార్లు పరోక్షంగా ప్రత్యక్షంగా చిరంజీవి పై సెటైర్లు వేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ చిరంజీవి మాత్రం బాలయ్య మీద ఇప్పటి వరకు ఎలాంటి కౌంటర్ కూడా ఇవ్వలేదు. కానీ ఎక్కడైనా వీళ్లిద్దరు కలిసినప్పుడు బాగానే మాట్లాడుకుంటారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేసే రోజున బాలయ్య, చిరంజీవి ఒకే వేదికపై కనిపించారు. బాలయ్య బాబు స్వయంగా చిరంజీవి ని ఆహ్వానించినా విజువల్స్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అంతే కాకుండా త్వరలో ఆహా లో ప్రారంభం కానున్న అన్ స్టాపబుల్ మూడవ సీజన్ లో ఒక ఎపిసోడ్ కోసం ముఖ్య అతిధి గా పాల్గొనేందుకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.