Mega158 launch delay: ‘వాల్తేరు వీరయ్య’ లాంటి భారీ కమర్షియల్ సక్సెస్ తర్వాత , చిరంజీవి(Megastar Chiranjeevi) , బాబీ(Bobby Kolli) కాంబినేషన్ లో రీసెంట్ గానే మరో సినిమా కుదిరిన సంగతి తెలిసిందే. ఏ ముహూర్తం లో ఈ సినిమాని చిరంజీవి ఒప్పుకున్నాడో తెలియదు కానీ , ఇప్పటి వరకు కనీసం ప్రారంభోత్సవానికి కూడా నోచుకోలేదు ఈ చిత్రం. పలానా డేట్ లో ఈ సినిమా మొదలు అవ్వబోతుంది అని చెప్పడం , చివరికి వాయిదా పడడం , జనవరి నెల నుండి ఇదే రిపీట్ అవుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ నెల 11 న ఈ చిత్రానికి సంబంధించిన పూజ కార్యక్రమాలు మొదలు పెట్టాలని అనుకున్నారు. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని కూడా రీసెంట్ గానే డైరెక్టర్, నిర్మాత ఆహ్వానించాడు. అంతా ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మరోసారి ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది.
కారణం ఈ సినిమా ని నిర్మించే KVN ప్రొడక్షన్స్ సంస్థ సంక్షోభం లో చిక్కుకోవడమే. ఈ సంస్థ లోనే తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరో గా నటించిన ‘జన నాయగన్’ చిత్రం తెరకెక్కింది. ఎప్పుడో జనవరి 9 న విడుదల అవ్వాల్సిన ఈ సినిమా, సెన్సార్ సర్టిఫికేట్ నిరాకరించడం తో అర్థఅంతరంగా వాయిదా పడింది. దీంతో ఈ సినిమా నిర్మాత చిక్కుల పడ్డాడు. బయ్యర్స్ అందరికీ డబ్బులు తిరిగి ఇచ్చేయాల్సి వచ్చింది. ఆ కారణం చేతనే ఈ చిరంజీవి , బాబీ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. అయితే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని, ఇక సినిమాని విడుదల చెయ్యడానికి అన్ని విధాలుగా ప్లానింగ్ చేసుకుంటున్న నిర్మాతకు , నిన్న సోషల్ మీడియా లో ఈ చిత్రం మొత్తం HD క్వాలిటీ తో లీక్ అవ్వడం పెద్ద చావు దెబ్బ అనే చెప్పాలి.
సోషల్ మీడియా మొత్తం ఎక్కడ చూసిన ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశాలే కనిపిస్తున్నాయి. పాపం నిర్మాత పరిస్థితి వర్ణనాతీతం. ఇలాంటి కష్టసమయం లో ముహూర్తపు షాట్స్ పెట్టుకోవడం శుభకరం కాదని మెగాస్టార్ చిరంజీవే స్వయంగా వద్దని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా అసలు ఎప్పుడు ప్రారంభం అవుతుంది?, అసలు ఉంటుందా లేదా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు మేకర్స్. పరిస్థితులు ఇలాగే కొనసాగితే , వేరే నిర్మాత చేతుల్లోకి ఈ చిత్రం వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. మరి ఏమి జరగబోతుందో చూడాలి. డైరెక్టర్ బాబీ ఈసారి కమర్షియల్ కథతో కాకుండా , మంచి గ్యాంగ్ స్టర్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న స్టోరీ ని రెడీ చేశాడు . మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ చిత్రం లో కీలక పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా , మలయాళం యంగ్ హీరోయిన్ అనశ్వర రాజన్ చిరంజీవి కి కూతురు పాత్ర పోషించబోతుంది.