మహేష్ వర్సెస్ ఎన్టీఆర్.. ముందుగా వచ్చేదెవరు?

‘అలవైకుంఠపురములో’ మూవీతో దర్శకుడు త్రివిక్రమ్ ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు. అల్లు అర్జున్.. పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. అటూ అల్లు అర్జున్ కెరీర్లోనూ.. ఇటూ త్రివిక్రమ్ కెరీర్లోనూ ఓ మైల్ స్టోన్ గా ‘అలవైకుంఠపురములో’ నిలిచిపోయింది. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్-జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో ఓ మూవీ రాబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. అయితే కరోనా కారణంగా షూటింగులన్నీ క్యాన్సిల్ కావడంతో దర్శక, నిర్మాతల ప్లాన్స్ అన్ని […]

Written By: NARESH, Updated On : October 12, 2020 3:36 pm
Follow us on

‘అలవైకుంఠపురములో’ మూవీతో దర్శకుడు త్రివిక్రమ్ ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు. అల్లు అర్జున్.. పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. అటూ అల్లు అర్జున్ కెరీర్లోనూ.. ఇటూ త్రివిక్రమ్ కెరీర్లోనూ ఓ మైల్ స్టోన్ గా ‘అలవైకుంఠపురములో’ నిలిచిపోయింది.

ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్-జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో ఓ మూవీ రాబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. అయితే కరోనా కారణంగా షూటింగులన్నీ క్యాన్సిల్ కావడంతో దర్శక, నిర్మాతల ప్లాన్స్ అన్ని చెదిరిపోయాయి. దీనికితోడు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఎన్టీఆర్ ఇరుక్కుపోయాడు. ఈ సినిమా పూర్తయితేగానీ ఎన్టీఆర్ మరో సినిమా చేసేందుకు వీల్లేకుండా పోతుంది.

Also Read: టీజర్ లో ఎన్టీఆర్ మూడు గెటప్ లు కూడా !

గతంలో వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన ‘అరవింద సమేతవీరరాఘవ’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుందుకుంది. దీంతో వీరి కాంబినేషన్లో సినిమా వస్తుందంటే నందమూరి ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. ఈ సినిమాకు ‘అయిననుపోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ను పరిశీలనలో ఉంది. ఆర్ఆర్ఆర్ కారణంగా ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ మరింత ఆలస్యం అయ్యేలా కన్పిస్తోంది.

ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ మహేష్ తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. మహేష్ ప్రస్తుతం దర్శకుడు పర్శురాం తెరకెక్కిస్తున్న ‘సర్కారువారిపాట’ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ అమెరికాలో చేయాలని చిత్రయూనిట్ సన్నహాలు చేసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాలో షూటింగ్ రిస్కుతో కూడుకున్నది కావడంతో ప్రస్తుతానికి సినిమా షూటింగ్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

Also Read: ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోలను లైన్లో పెట్టిన త్రివిక్రమ్..!

ఈ సినిమా కోసం మహేష్ తాజాగా 45రోజులు డేట్స్ ఇచ్చినట్లు ఇవ్వగా అవన్నీ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. దీంతో మహేష్ ప్లాన్స్ అన్నీ తలకిందులయ్యాయి. సినిమా స్క్రీప్ట్.. దర్శకుల విషయంలో మహేష్ చాలా క్లారిటీ ఉంటారనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఎవరైతే సినిమాలను స్పీడుగా తెరకెక్కిస్తారో వారితో నటించేందుకు మహేష్ ముందుంటాడు. ‘సర్కారువారిపాట’ ఆలస్యం అవుతుండటంతో మహేష్ కొత్త దర్శకుడి కోసం చూస్తున్నాడనే టాక్ విన్పిస్తోంది.

ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్-మహేష్ కాంబో తెరపైకి వచ్చింది. వీరిద్దరు ప్రస్తుతం ఖాళీగా ఉండటంతో వీరి కాంబినేషన్ అందరికీ కంటే ముందుగా పట్టాలెక్కనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో త్రివిక్రమ్ ముందుగా ఎన్టీఆర్ తో వస్తాడా? లేదా మహేష్ తో వస్తాడా? అన్నది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంతవరకు వేచి చూడాల్సిందే..!