Radhe Shyam: ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా రాధేశ్యామ్. భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. యూరప్ నేపథ్యంలో పీరియాడికల్ లవ్స్టోరీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన టీజర్, తొలి రిలికర్ సాంగ్స్తో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ముఖ్యంగా ఈ రాతలే పాట సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచింది.
కాగా, ఈ పాటకు కృష్ణకాంత్ రచయితగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. సినిమాతోపాటు ఈ పాట గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రాధేశ్యామ్ సినిమా పునర్జన్మకు సంబంధించి కథ అని, టైమ్ ట్రావెల్ అని, ట్రైన్లోనే సినిమా మొత్తం జరుగుతుందని ఇలా ఎవరికి వారు ఊహలు అల్లుకుంటున్నారు. అయితే, ఈ కథ ఏంటనేంది వారి ఊహలకు వదిలేస్తున్నానని అన్నారు.
ఇక తను రాసిన ఈ రాతలే పాట గురించి చెప్తూ.. ఆ పాట అందరికీ అర్థం కాదు. విజువల్స్ చూస్తే కానీ, అసలు ఎలా రాయడానికి కారణం తెలియదు. నిజానికి ఈ పాటలోనే సినిమా కథ ఉంది. అని చెప్పుకోచ్చారు కృష్ణకాంత్.ప్రస్తుతం ఈయన శ్యామ్ సింగరాయ్తోపాటు, ది ఘోస్ట్, మేజర్, హిట్2 సినిమాలకూ పాటలు రాస్తున్నారు. కాగా, ప్రభాస్ రాధేశ్యామ్తో పాటు, సలార్, ఆదిపురుష్లోనూ నటిస్తున్నారు. ఇటీవలే ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేసుకున్నారు.