Kiara Advani Emotional: పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఒకరు కియారా అద్వానీ. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఈమె పేరు చెప్తేనే మెలికలు తిరిగిపోతుంటారు. తెలుగు లో ఈమె చేసింది మూడు సినిమాలే. అందులో ఒక్కటే కమర్షియల్ గా యావరేజ్ రేంజ్ లో ఆడింది , మిగిలిన రెండు సినిమాలు ఒక దానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. అయినప్పటికీ ఈమెకు ఇసుమంత క్రేజ్ కూడా తగ్గలేదు. తెలుగు లో ఈమెకు హిట్స్ లేకపోవచ్చు కానీ , బాలీవుడ్ లో వరుసగా బ్లాక్ బస్టర్స్ ని అందుకొని , అక్కడి స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా నిల్చింది. ఇకపోతే ఈమె 2023 వ సంవత్సరం లో ప్రముఖ బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా ని ప్రేమించి పెళ్లాడింది. రీసెంట్ గానే వీళ్లిద్దరికీ ఒక పాప కూడా పుట్టింది.
అయితే ఇటీవలే కియారా అద్వానీ ఒక ప్రముఖ బాలీవుడ్ పోడ్ క్యాస్ట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో , ఆమె పాపకు జన్మని ఇచ్చిన తర్వాత పడిన బాధ గురించి చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె మాట్లాడుతూ ‘నాకు పాప పుట్టిన తర్వాత 6 నెలల వరకు నరకం చూశాను. నాపై నాకే చాలా జాలి కలిగేది , అది నా మనసుకి చాలా కష్టం గా అనిపించింది. చిన్న చిన్న విషయాలకే ఎమోషనల్ అయిపోయి ఏడ్చేసేదాన్ని , నాలోని ఎమోషన్స్ ని అసలు కంట్రోల్ చేసుకోలేకపోయాను. నా మనసులోని భావాలను సరిగ్గా అర్థం చేసుకోవడానికి , వాటికి ప్రాధాన్యత ఇవ్వడానికి నాకు ఏకంగా ఆరు నెలల సమయం పట్టింది. ఎంతసేపు కుటుంబం , పని, ఇతరుల మంచి గురించి మాత్రమే కాదు , నా గురించి నేను ఆలోచించుకోవడం అనేది ఈ మాతృత్వం నేర్పింది’.
‘ఇలా ఎమోషనల్ ఇన్ బాలన్స్ గా ఉన్న సమయం లో నా భర్త సిద్దార్థ్ మల్హోత్రా ఇచ్చిన సప్పోర్టుని జీవితాంతం మర్చిపోలేను. ప్రతీ రోజు షూటింగ్ చేసి అలిసిపోయి వస్తాడు. కానీ నా దగ్గరకు వచ్చి , నన్ను సంతోష పెట్టడం కోసం డ్రైవ్ కి తీసుకెళ్లేవారు. ఈ డ్రైవ్స్ నా మనసుకు ఎంతో ప్రశాంతత ని అందించాయి’ అంటూ చెప్పుకొచ్చింది కియారా అద్వాని. ఇకపోతే రీసెంట్ గానే ఆమె కన్నడ సూపర్ స్టార్ యాష్ తో కలిసి ‘టాక్సిక్’ అనే చిత్రంలో నటించింది. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం , కొన్ని అనుకోని కారణాల వల్ల, వాయిదా పడింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన సరికొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్.