Online Movie Tickets: ఇటీవల ఏపీలో ఆన్లైన్ సినిమా టికెట్ల వ్యవహారం పెద్ద చర్చగా మారింది. దీనికి తోడు సినిమా థియేటర్లు టికెట్లను తక్కువ ధరకు విక్రయించాలని ప్రవేశపెట్టిన బిల్లుకు వ్యతిరేకంకా పలువురు సినీ నిర్మాతలు, సినీ తారలు సీఎం జగనకు విజ్ఞప్తి చేశారు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ నిర్మాత కూడా ఈ విషయంపై స్పందించిన సంగతి తెలిసిందే. మరోవైపు, చిరంజీవి కూడా ట్విట్టర్ వేదికగా జగన్కు విజ్ఞప్తి చేస్తూ.. లేఖ రాశారు.

Also Read: సినిమా టికెట్ ధరల విషయంలో ఏపీ సీఎం జగన్కు చిరు విజ్ఞప్తి
థియేటర్ల మనుగడ కోసం, సినిమానే ఆధారంగా బతుకున్న ఎంతో మంది కుటుంబాల కోసం, తగ్గించిన టికెట్ ధరలను.. సముచితంగా.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా నిర్ణయిస్తే అదరికీ మేలు జరుగుతుందని చిరు తెలిపారు. దేశమంతా ఒకటే జీఎస్టీ ఉన్నప్పుడూ.. టికెట్ ధరల విషయంలో అదే వెసులుబాటు ఎందుకు ఉండకూడదని అన్నారు. దయచేసి ఈ విషయంపై పునరాలోచన చేయాలని జగన్ను విన్నపించుకుంటూ ట్వీట్ చేశారు.
కాగా, తాజాగా, ఆన్లైన్ టికెట్ విధానాన్ని తెలంగాణాలోనూ తీసుకురావాలని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్రెడ్డి.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావును కోరారు. ఏపీ ప్రభుత్వం లాగే.. సినిమా టికెట్లను ఆన్లైన్లో అమ్మాలని మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం ఈ విషయం హాట్టాపిక్గా మారింది. మరి ఈ విషయంపై సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు, ఏపీ ప్రభుత్వంతోనే ఇంకా పోరాడుతున్న సీనీ ప్రముఖులకు.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా లాగే నిర్ణయం తీసుకుంటే.. ఎలా స్పందిస్తారో చూడాలి మరి.