Homeఎంటర్టైన్మెంట్'మహా నటి' ఖాతాలో మరో అరుదైన ఘనత

‘మహా నటి’ ఖాతాలో మరో అరుదైన ఘనత

Keerthy Suresh
కీర్తి సురేష్… ప్రస్తుతం దక్షిణాదిన అగ్రశ్రేణి కథానాయికలలో ఒకరుగా కొనసాగుతున్నారు. తెలుగు, తమిళ భాషలలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అలనాటి సినీనటి సావిత్రమ్మ జీవిత కథ ఆధారంగా వచ్చిన “మహానటి ” మూవీతో కీర్తి కెరీర్ గ్రాఫ్ విపరీతంగా పెరిగింది. ఆ సినిమాలో ఉత్తమ నటన కనబరిచినందుకు గాను ఈ భామకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. తాజాగా ఈ బ్యూటీ ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకుని మరో అరుదైన గౌరవాన్ని పొందింది.

Also Read: మళ్లీ జబర్ధస్త్‌లోకి రావడంపై స్పందించిన చమ్మక్ చంద్ర !

ప్రఖ్యాత ఫోర్బ్స్ సంస్థ ప్రతి ఏటా గడిచిన ఏడాదిలో వివిధ రంగాలలో అత్యంత ప్రతిభ, ప్రభావం చూయించిన కొంతమంది జాబితాని ప్రకటిస్తుంది. ఆ క్రమంలో తాజాగా మొత్తం 30 మందితో కూడిన జాబితాని ఫోర్బ్స్ రిలీజ్ చేయగా… అందులో కీర్తి సురేష్ కి చోటు లభించింది. అయితే 2020 సంవత్సరానికి గాను ఎంటర్టైన్మెంట్ విభాగంలో మరో నటి ‘త్రిప్తి దిమ్మిరి’ తో పాటుగా కీర్తి ఈ జాబితాలో నిలిచి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

Also Read: పెళ్లి తరువాత సింగర్ సునీత.. ఎలా ఉందో తెలుసా ? పిక్ వైరల్

ఇదే విషయాన్ని కీర్తి తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఫోర్బ్స్ కి ధన్యవాదాలు తెలుపుతూ… తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. సోషల్ మీడియాలో అందరూ కీర్తిని అభినందిస్తూ శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇక కీర్తి సినిమాల విషయానికొస్తే… అమ్మడు సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తుంది. తెలుగులో కీర్తి ఈ సినిమాతో పాటు నితిన్‌కు జోడిగా ‘రంగ్‌దే’లో నటిస్తోంది. ఇవేకాకుండా మరికొన్ని తమిళ, తెలుగు ప్రాజెక్ట్స్ లో కీర్తి ఫైనల్ అయ్యిందని తెలుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version