‘తేజస్’ మూవీని సర్వేశ్ మేవర అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. ఆర్ఎస్వీపీ ప్రొడక్షన్ పతాకంపై రోని స్క్రూవాలా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థ తెరకెక్కించిన ‘ఉరి’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దేశ సైనికుల కథాంశంతో ‘ఉరి’ మూవీ తెరకెక్కి పలు అవార్డులను కూడా గెలుచుకుంది. కాగా ఎయిర్స్ ఫోర్స్ కథాంశంతో ‘తేజస్’ మూవీ తెరకెక్కుతుండటంతో ఈ మూవీపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని వచ్చే 2021 ఏప్రిల్ లో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది.
ప్రస్తుతం కంగనా రనౌత్ ‘క్వీన్’, ‘మణికర్ణిక’ సినిమాల్లో నటిస్తూ బీజీగా ఉంది. వరుసగా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీల్లో నటిస్తుంది. అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితాధారంగా తెరకెక్కుతున్న ‘తలైవీ’ మూవీలో జయలలితగా నటిస్తుంది. వరుసగా ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ విమర్శకుల ప్రశంసలను అందుకుంటుంది. బాలీవుడ్ హీరోలకు ధీటుగా తన సినిమాలతో కలెక్షన్లు రాబడుతూ కంగనా రనౌత్ బాలీవుడ్ క్వీన్ అనిపించుకుంటుంది.