సైరా చిత్రం తరవాత తన 152 వ చిత్రం గా చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్లో చేస్తున్న ‘ఆచార్య’ సినిమాలో హీరోయిన్ ఎంపిక పూర్తి అయ్యింది. తొలుత త్రిష కథానాయిక గా నటిస్తుంది వినోదానికి సందేశాన్ని మేళవించి కొరటాల శివ సిద్ధం చేసుకున్న ఈ కథలో తొలుత త్రిష కథానాయిక గా నటిస్తుంది అన్నారు. అనుకోని కారణాల వల్ల కథానాయికగా ఎన్నికైన ‘త్రిష’ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. తరవాత కాజల్ , అనుష్క పేర్లు బయటికి వచ్చాయి. చివరకి ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాను దృష్టిలో పెట్టుకుని, కాజల్ అయితే బాగుంటుందని భావించి ఆమెనే ఖరారు చేశారట…ఈ క్రమంలో కాజల్ పారితోషికంగా రెండున్నర కోట్లు అడిగిందట. చివరికి ఒకటిన్నర కోటికి చేయడానికి ఆమె అంగీకరించినట్టు తెలుస్తోంది . త్వరలోనే ఆమె షూటింగులో పాల్గొననున్నట్టు చెబుతున్నారు.
చిరంజీవి కథానాయకుడిగా మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారితో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ నటిస్తున్నట్టుగా మొదట్లో వార్తలు వచ్చాయి. ఆ తరువాత తెరపైకి మహేశ్ బాబు పేరు వచ్చింది. ఆ క్రమం లో ఈ సినిమా కోసం మహేశ్ బాబు రోజుకి కోటి రూపాయలు పారితోషికంగా అడిగినట్టు తెలిసింది. ఆ తరవాత ఏమయిందో గాని మళ్లీ రామ్ చరణ్ సీన్లో కి వచ్చాడు .. కానీ పారితోషకం విషయం లో డీల్ మారలేదు. చెర్రీ ఎన్ని రోజులు షూటింగులో పాల్గొంటే అన్ని కోట్లు ఇచ్చేలా మాట్లాడుకున్నారట. ఇక చిరంజీవికి పారితోషికంతో పాటు, లాభాల్లో వాటా కూడా ముట్టనుందని చెబుతున్నారు.
Remuneration is criteria for stardom