Anchor Rashmi : ఆ స్టాంప్‌ నే యాంకర్ రష్మీకి శాపమా.. సినిమా అవకాశాలు అందుకే రాలేదా?

వెళ్లిపోనని రష్మీ చెప్పింది. సినిమాలు చేస్తూనే టీవీ ప్రోగ్రాంలు కూడా చేస్తానని స్పష్టం చెప్పింది. దీంతో కార్యక్రమంలో ఉన్నవారంతా చప్పట్లతో అభినందించారు.

Written By: Raj Shekar, Updated On : May 14, 2023 8:44 pm
Follow us on

Anchor Rashmi : రష్మీగౌతమ్‌.. పరిచయం అక్కరలేని పేరు. టెలివిజన్‌ స్క్రీన్‌పై యాంకర్లు సుమ, అనసూయ తర్వాత అంతటి గుర్తింపు ఉన్న యాంకర్‌ రష్మీ. ముఖ్యంగా జబర్దస్‌ ప్రోగ్రాంతో రష్మీ బుల్లితెర ఆడియన్స్‌కు చాలా దగ్గరైంది. తెలుగు అమ్మాయే అయినప్పటికీ.. అచ్చిరాని తెలుగు మాటలు.. భాషలో దొర్లే తప్పులతో కామెడీ చేయడం ద్వారా సగటు టీవీ అభిమాని కూడా షర్మీని అభిమానిస్తున్నాడు. దీంతో టెలివిజన్‌రంగంలో మంచి పొజిషన్‌లో ఉంది. అయితే బుల్లితెర ఆధారంగా వెండితెర చాన్స్‌లు కూడా రష్మీకి వచ్చాయి. అయితే బుల్లితెరపై రాణించినంతగా వెండితెరపై రాణించలేకపోతోంది. ముఖ్యంగా అనసూయ వెండితెరపై మంచి చాన్స్‌లు కొట్టేస్తోంది. రష్మీ మూడు నాలుగు సినిమాలు చేసినా అనసూయలా గుర్తింపు మాత్రం రాలేదు.

రష్మీ స్టాంప్‌ అదేనా.. 
మాతృదినోత్సవం సందర్భంగా ఈటీవీలో ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంలో యాంకర్‌ రష్మీ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కొంతమంది నటీనటులతో ఓపెన్‌హార్ట్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురిని యాంకర్‌ రష్మీ ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ఓపెన్‌గానే చాలామంది సమాధానం చెప్పారనిపించేలా కార్యక్రమం చేశారు. అయితే చివరకు జడ్జి ఇంద్రజ కూడా రష్మీని ఓపెన్‌హార్ట్‌ సమాధానం కోసం ప్రశ్న అడిగారు. ఈ సందర్భంగా ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన రష్మీ తనపై ఉన్న ఆ స్టాంప్‌ కారణంగానే తనకు సినిమా అవకాశాలు రావడం లేదని సమాధానం చెప్పింది.
సినిమాలో ఎందుకు రాణించడం లేదు.. 
టీవీ ప్రోగ్రాంలలో చక్కగా రాణిస్తున్న రష్మీ.. సినిమాల్లో ఎందుకు రాణించడం లేదు అని ఇంద్రజ ప్రశ్నించారు. దీనిక ఓపెన్‌గా సమాధానం చెప్పాలని కోరారు. అందుకు అంగీకరించిన రష్మీ.. సినిమా ఇండస్ట్రీపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. అవకాశాలు వస్తున్నాయని, అయితే రాత్రికి రాత్రే క్యారెక్టర్స్‌ మారిపోతున్నాయని చెప్పింది. సెకండ్‌ హీరోయిన్‌గా వచ్చిన చాన్స్‌లు తర్వాత పాత్రలు మార్చేసిన ఘటనలు కూడా ఉన్నాయని తెలిపింది. ఇక సినిమా ఇండస్ట్రీలో కొన్ని క్యారెక్టర్లు చేసే వారికి వారైతేనే అవి చేస్తారన్న స్టాంప్‌ ఉందన్నారు. ఆ కారణంగా తల్లిపాత్రలు వీరే చేస్తారు.. చెల్లి పాత్రలు వాళ్లే చేస్తారు.. హీరోయిన్‌ వీరే చేయాలన్న స్టాప్‌తో అవకాశాలు కొందరికే వస్తున్నాయని తెలిపారు.
ఆడియన్స్‌ రిసీవింగ్‌ ఉండాలి.. 
ఇవన్నీ ఒక ఎత్తయితే పాత్రను ఆడియన్స్‌ రిసీవ్‌ చేసుకుంటేనే గుర్తింపు ఉంటుందని తెలిపింది. ఆ గుర్తింపు లేకుంటే అవకాశాలు రావని పేర్కొంది. తనను బుల్లితెర యాంకర్‌గానే చాలామంది చూస్తున్నారని ఆకారణంగానే సినిమా అవకాశాలు రాకపోవడానికి కారణం అయి ఉండొచ్చని తెలిపింది.
టీవీని ఎప్పుడూ వీడను..
ఇక, భవిష్యత్‌లో సినిమాల్లో అవకాశాలు వచ్చినా తాను టీవీ ప్రోగ్రామ్స్‌ నుంచి ఎప్పుడూ వెళ్లిపోనని రష్మీ చెప్పింది. సినిమాలు చేస్తూనే టీవీ ప్రోగ్రాంలు కూడా చేస్తానని స్పష్టం చెప్పింది. దీంతో కార్యక్రమంలో ఉన్నవారంతా చప్పట్లతో అభినందించారు.