Radhesyam: ‘సాహో’ తర్వాత డార్లింగ్ ప్రభాస్ నుంచి వస్తున్న చిత్రం ‘రాధాకృష్ణ’. ప్రభాస్ వరుస బెట్టి అన్ని ప్యాన్ ఇండియా సినిమాలనే రాబోతున్నాయి. ‘సాహో’ మూవీ దక్షిణాదిలో కంటే ఉత్తరాదిలోనే ఎక్కువ కలెక్షన్లు సాధించింది. దీంతో ఉత్తరాదిలో ప్రభాస్ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రభాస్ మూవీ కోసం నార్త్ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జనవరి 14న ‘రాధేశ్యామ్’ రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితుల కారణంగా ఈ చిత్రాన్ని వాయిదా వేయక తప్పలేదు.
దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురికావాల్సి వచ్చింది. అయితే ‘రాధేశ్యామ్’ దర్శకుడు రాధాకృష్ణ ప్రభాస్ అభిమానుల్లో ఉత్సాహం నింపేలా తాజాగా వారితో ట్వీటర్లో చిట్ చాట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా ప్రభాస్ అభిమానులు రాధాకృష్ణ ను ఆసక్తికర ప్రశ్నలను అడిగి సమాధానం రాబట్టారు. అలాంటి వాటిలో కొన్ని ముఖ్యమైన విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!
* రాధేశ్యామ్ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాల్సి వస్తే?
రాధాకృష్ణ: ‘ప్రేమ’ మాత్రమే ఉంటుంది.
* రాధేశ్యామ్ కథలో కొత్తగా ఏం చూపట్టబోతున్నారు?
రాధాకృష్ణ: నిజమైన ప్రేమను
* ప్రభాస్ గురించి ఒక్క మాటలో?
రాధాకృష్ణ: తన నవ్వుతో ప్రపంచంలోని బాధలను పొగట్టి ప్రశాంతంగా ఉంచేలా చేయగలడు.
* కృష్ణం రాజు గురించి?
రాధాకృష్ణ: ఆయన ఒక ‘పరమహంస’
* పూజా గురించి ఏం చెబుతారు?
రాధాకృష్ణ: హీరోయిన పూజా ఈ మూవీ కోసం తన బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆమె అద్భుతమైన నటి.
* ప్రభాస్ లుక్స్, డాన్స్ గురించి?
రాధాకృష్ణ: ఇది వరకంటే అద్భుతంగా ఉంటాయి.
* రాధేశ్యామ్ పై వచ్చే మీమ్స్ పై స్పందన?
రాధాకృష్ణ: మీమ్స్ అన్ని కూడా ఒత్తిడిని తగ్గిస్తాయి. వీటిని ఎంజాయ్ చేస్తాను.
* రాధేశ్యామ్ ఎప్పుడు రిలీజు అవుతుంది?
రాధాకృష్ణ: కరోనా పరిస్థితులు తగ్గిన వెంటనే థియేటర్లలో కలుద్దాం.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Interesting the director who told the story of radheshyam in one word
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com