Prabhas: బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారారు రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ సినిమాలు అన్ని పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్నాయి. అందులో భాగంగా నాగ్ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం “ప్రాజెక్ట్ K” ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం నుంచి పలు వార్తలు వస్తున్నాయి.

సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా” ప్రాజెక్ట్ K” ఈ చిత్రానికి ముందుగా మిక్కీ జె మేయర్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన అధికార ప్రకటన కూడా వచ్చింది. అయితే ఇప్పుడు ఓ కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ను తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళంలో ‘కబాలి’, ‘కాలా’, ‘జిగర్తాండ’ సహా పలు సినిమాలకు సంగీతం అందించిన సంతోష్ నారాయణ్ను ఎంపిక చేసినట్లు సమాచారం.
ఈ సినిమా నుంచి మిక్కీని తప్పించి సంతోష్ను తీసుకున్నారా లేదా వీరిద్దరూ కలిసి ఈ సినిమా కోసం పనిచేయనున్నారా అనేది తెలియాల్సి ఉంది. దీంతో త్వరలో దీని గురించి క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. ఈ సినిమా షూటింగ్ కొంత కాలం క్రితం ప్రారంభించారు. ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తున్న అమితాబ్ బచ్చన్ పై కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు చిత్ర బృందం. త్వరలోనే ప్రభాస్ కూడా సెట్స్లోకి వెళ్లనున్నారు అని సమాచారం. వచ్చే ఏడాది జనవరి 14న “రాధే శ్యామ్” చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రభాస్ ఇప్పటికే విడుదలైన పాటలు పోస్టర్స్ ఈ సినిమా పై భారీ అంచనాలు పెంచాయి.