Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 7 Telugu: పెళ్లం, పిల్లలను వదిలేసి వచ్చాను.. ఎమోషనల్ అయినా శివాజీ

Bigg Boss 7 Telugu: పెళ్లం, పిల్లలను వదిలేసి వచ్చాను.. ఎమోషనల్ అయినా శివాజీ

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‌లో ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్ నిర్వహించాడు బిగ్ బాస్. ఈ రేస్ లో బిగ్ బాస్ ఇచ్చిన చివరి టాస్క్ ల్లో గెలిచి గౌతమ్ కృష్ణ ,పల్లవి ప్రశాంత్ ,తేజ ,సందీప్ మాస్టర్ పోటీదారులుగా నిలిచారు. మొత్తం మీద రంగు పడుద్ది టాస్క్ లో విరుచుకుపడి కెప్టెన్సీ టాస్క్ లో విన్ అయ్యాడు పల్లవి ప్రశాంత్. ఈ సీజన్ లో ఫస్ట్ కెప్టెన్ కూడా ప్రశాంతే.. అయితే ఈ టాస్క్ చేస్తున్నప్పుడు ఎన్నో సంఘటనలు ఎదురయ్యాయి. కొందరు ప్రేమతో త్యాగం చేస్తే కొందరి మద్య పోటీ మాత్రం తప్పలేదు. ఇక ఇదిలా సాగితే.. కొందరు మాత్రం ఎమోషనల్ అయ్యారు. ఆ వివరాలు ఇప్పుడు మీకోసం…

అమ్మ ఆరోగ్యం బాగాలేదని ఆట సందీప్ చెప్పగా భార్య నుంచి వచ్చిన లెటర్ ను త్యాగం చేశాడు అమర్ దీప్. అందుకే కెప్టెన్సీ కంటెండర్ గా అమర్ నిలవలేకపోయాడు. సందీప్ కెప్టెన్సీ మాత్రం కంటెండర్ గా నిలిచాడు. వీరి తర్వాత శివాజీ, ప్రశాంత్ ల వంతు వచ్చింది. ఈ ఇద్దరు యాక్టివిటీ రూమ్ కు వెళ్లారు. అక్కడ శివాజీ కోసం కాఫీతోపాటు భార్య పంపిన లెటర్ ఉంది. అలాగే ప్రశాంత్ అమ్మనాన్నల నుంచి వచ్చిన లెటర్ ఉంది. ఎప్పటి నుంచో కాఫీ అడుగుతున్న శివాజీకి అక్కడ అది చూడగానే ఎక్కడా లేని ఎనర్జీ వచ్చింది.

అబ్బా ఓరి నీయవ్వా.. థ్యాంక్స్ బిగ్ బాస్ కాఫీ ఇచ్చినందుకు అని చెప్పిన శివాజీ ఒక సిప్ వేశాడు. తర్వాత ఎమోషనల్ డ్రామాలేం వద్దురా. కుల్లా కుల్లా చెబుతున్నా. నీకు కెప్టెన్సీ ఇచ్చేద్దామని అనుకున్నా. చివర్లో మనకు పడితే నీకే ఇచ్చేద్దామనుకున్నా. కామన్ మ్యాన్ ఈడదాకా తీసుకువచ్చాడంటే గెలవాల్సిందే. నీకు అప్పుడే జెప్పినా కదా ఇస్తా అని. నాకు కాఫీ ఇచ్చాడుగా చాలు. కంటెండర్ ఇక ఏం వద్దు. నువ్వు కంటెండర్ అవ్వు అని శివాజీ అన్నాడు.

కామన్ మ్యాన్‌గా వచ్చినవ్. వచ్చినప్పుడు హగ్ ఇచ్చినవ్. నీతోటి ఎవరూ మాట్లాడట్లేదు అన్నవ్. నీకు నేనున్నా బిడ్డా అన్నా. ఆడు.. దున్ను.. కానీ, నీ లైన్‌లో.. లైన్ దాటకుండా ఆడు. నేను నా కొడుకుతో పందెం కట్టి వచ్చాను అంతే. అయినా నాకు గివప్ చేయడం ఇష్టం లేదు. కానీ, గివప్ ఇచ్చి నువ్వు గెలవాలని నీ వెనకాల నిలబడుతున్నాను. నా పెళ్లాం అర్థం చేసుకుంటది. నేను తనను బాగా చూసుకున్నానో లేదో గానీ, తనైతే నన్ను దునియాలా చూసుకుంది అని శివాజీ చెప్పుకొచ్చాడు.

ఎమోషనల్ ను కూడా ప్రశాంత్ కోసం త్యాగం చేస్తూ చాలా కామన్ గా చెప్పాడు శివాజీ. అయితే పెళ్లాన్ని, కొడుకును వదిలేసి వచ్చాను అని.. ముఖ్యంగా ఎంతో ఇష్టమైన కాపీని కూడా వదిలేసి వచ్చాను అన్నాడు. అంతే కాదు కాఫీ శివాజీకి రెండో పెళ్లమట. ఇంకాస్త సంభాషణ కంటిన్యూ చేస్తూ.. నీకన్నా పెద్దవాన్ని, ఏం చేయాలో తెలుసు? అంతే కాదు ఆ లెటర్ లో ఏం ఉంటుందో కూడా తెలుసు.. అని చెబుతూనే భార్య పిల్లల గురించి మాట్లాడాడు శివాజీ. అంతే కాదు ప్రశాంత్ కోసం ఆ లెటర్ కూడా నలిపివేశాడు. ఆ తర్వాత ప్రశాంత్ ను తన లెటర్ ను చదువుకో అని చెప్పాడు. అదే సందర్భంగా ప్రశాంత్ కూడా లెటర్ ను నలిపేస్తుంటే.. శివాజీ వెంటనే ఒట్టు పెట్టాడు. పిచ్చి పనులు చేయద్దు అంటూ వారించాడు. ఇదంత జరిగిన తర్వాత ప్రశాంత్ ఆ లెటర్ చదివి చాలా ఎమోషనల్ అయ్యాడు. కానీ శివాజీ లెటర్ త్యాగం చేయడం వల్ల మొత్తం మీద ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో విన్ అయ్యాడు పల్లవి ప్రశాంత్.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version