Renu Desai: మహేష్ మూవీలో ఛాన్స్ వదులుకున్నా… అదో కాంట్రవర్సీ అంటూ బాంబు పేల్చిన రేణూ దేశాయ్

70లలో హేమలత అనే మహిళ సామాజిక కార్యకర్త. మూఢాచారాల మీద ఆమె పోరాటం చేశారు. ఆ పాత్రను రేణూ దేశాయ్ చేశారు. ఇక టైగర్ నాగేశ్వరరావు అదే కాలం నాటి గజదొంగ.

Written By: NARESH, Updated On : October 20, 2023 11:40 am

Renu Desai

Follow us on

Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తెలుగులో చేసింది ఒక్క చిత్రమే. బద్రి తో హీరోయిన్ గా మారిన ఆమె పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడ్డారు. దాంతో సినిమాలకు గుడ్ బై చెప్పి వివాహం చేసుకున్నారు. రెండు దశాబ్దాల అనంతరం రేణూ దేశాయ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించారు. రవితేజ హీరోగా తెరకెక్కించిన పీరియాడిక్ క్రైమ్ డ్రామా టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో ఆమె హేమలత లవణం అనే పాత్ర చేశారు.

70లలో హేమలత అనే మహిళ సామాజిక కార్యకర్త. మూఢాచారాల మీద ఆమె పోరాటం చేశారు. ఆ పాత్రను రేణూ దేశాయ్ చేశారు. ఇక టైగర్ నాగేశ్వరరావు అదే కాలం నాటి గజదొంగ. ఆయన జీవిత కథ ఆధారంగానే టైగర్ నాగేశ్వరరావు తెరకెక్కింది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో రేణూ దేశాయ్ విరివిగా పాల్గొంది. ఈ సందర్భంగా అనేక విషయాలు ఆమె పంచుకుంటున్నారు. గతంలో మహేష్ బాబు సినిమాలో నటించాలని ఉంది. పాత్ర ఏదైనా పర్లేదని రేణూ దేశాయ్ అన్నారు.

అయితే ఆమెకు మహేష్ మూవీలో ఛాన్స్ వచ్చిందట. కాగా కొన్ని కారణలతో వదులుకున్నాను అన్నారు. 2022లో విడుదలైన సర్కారు వారి పాట భారీ వసూళ్లు రాబట్టింది. బ్యాంకులను లోన్స్ పేరుతో అధికారికంగా దోచుకునే రాజకీయ పెద్దల మీద వ్యంగ్యాస్త్రంగా సర్కారు వారి పాట తెరకెక్కింది. ఈ మూవీలో నదియా చేయని నేరానికి శిక్ష అనుభవించే బ్యాంకు ఆఫీసర్ రోల్ చేశారు.

ఈ పాత్ర రేణూ దేశాయ్ చేయాల్సిందట. రేణూ దేశాయ్ సైన్ కూడా చేశారట. అయితే కొన్ని కారణాలతో ప్రాజెక్ట్ ఆమె వదులుకున్నారట. ఎందుకో చెబితే కాంట్రవర్సీ అవుతుంది అంటూ ఆమె బాంబు పేల్చారు. ఆమె స్థానంలో నదియాను తీసుకోవడానికి ఏం జరిగిందో ఆమె చెప్పలేదు. ఏదో వివాదం అయితే నడిచిందని ఆమె మాటల ద్వారా అర్థం అవుతుంది. ఇక నేడు విడుదలైన టైగర్ నాగేశ్వరరావు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.