Trivikram wrote story for Venkatesh: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మాటల మాంత్రికుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్… కెరియర్ మొదట్లో రైటర్ గా తన మార్క్ ఏంటో చూపించాడు. స్టార్ హీరోలందరికి మంచి విజయాలను అందించిన ఆయన ఆ తర్వాత దర్శకుడిగా మారి తనకంటు ఒక క్రేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు…టాప్ హీరోలతో సినిమాలను చేసి టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు. తను రైటర్ గా ఉన్నప్పుడు వెంకటేష్ తో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సినిమాలకు కథలను అందించాడు. అవి సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇక మన్మధుడు సినిమా కథని కూడా మొదట వెంకటేష్ కోసమే రాసుకున్నాడట. కానీ అనుకోకుండా నాగార్జునకి ఆ కథ నచ్చడం ఆయన ఆ కథను తీసుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ నాగార్జున కి ఆ కథను ఇచ్చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు స్టార్ హీరోలకు సూపర్ సక్సెస్ లను అందించారు. కానీ త్రివిక్రమ్ మాత్రం అటు రైటర్ గా, ఇటు దర్శకుడిగా హీరోలకు సూపర్ సక్సెస్ లను కట్టబెడుతూనే ఉన్నాడు.
ఇక ఇప్పుడు వెంకటేష్ కు భారీ సక్సెస్ ని అందించాలనే ఉద్దేశంతో ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమాని చేస్తున్నాడు. మొదటిసారి వెంకటేష్ ను డైరెక్షన్ చేస్తున్నప్పటికి ఈ సినిమా మీద భారీ బజ్ అయితే ఉంది. ఇక ఇంతకుముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు తో గుంటూరు కారం సినిమా చేశాడు. ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయినప్పటికి ఆయన క్రేజ్ తగ్గలేదు.
మరి ఆదర్శ కుటుంబం సినిమాతో మరోసారి సంచలనాన్ని క్రియేట్ చేయగలుగుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో ఒక భారీ బడ్జెట్ సినిమా చేయటానికి కూడా సన్నాహాలు చేసుకుంటున్నాడు… ఇక ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా బడ్జెట్ దాదాపు 1000 కోట్ల వరకు ఉండబోతుందట.
మరి అంత మొత్తంలో త్రివిక్రమ్ మీద బడ్జెట్ పెట్టడం సరైనదేనా అలాగే జూనియర్ ఎన్టీఆర్ అంత మార్కెట్ ఉందా అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలు వ్యకతమవుతున్నాయి… ఇక దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ రావాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
