కరోనా ‘హాట్ స్పాట్’గా మారుతోన్న టాలీవుడ్..!

కరోనా పేరు చెబితేనే టాలీవుడ్ ఇండస్ట్రీ ఉలిక్కిపడుతోంది. ఇప్పటికే కరోనా ఎఫెక్ట్ తో గడిచిన ఐదారు నెలలుగా సినిమా షూటింగులు నిలిచిపోయాయి. దీంతో దర్శక నిర్మాతలు.. హీరోలు.. నటీనటుల ప్లాన్స్ అన్ని తలకిందులయ్యాయి. అయితే ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు షూటింగులకు అనుమతి ఇచ్చాయి. దీంతో టాలీవుడ్లోనూ షూటింగులు మొదలయ్యాయి. Also Read: ‘ఆర్ఆర్ఆర్’ను ఫాలో అవుతున్న ‘ఆచార్య’.! కరోనా నిబంధనలు పాటిస్తూ షూటింగులు చేసుకోవాలని ప్రభుత్వాలు మార్గదర్శకాలు విడుదల చేశాయి. కరోనా నిబంధనలను తూచ తప్పకుండా […]

Written By: NARESH, Updated On : October 18, 2020 5:49 pm
Follow us on

కరోనా పేరు చెబితేనే టాలీవుడ్ ఇండస్ట్రీ ఉలిక్కిపడుతోంది. ఇప్పటికే కరోనా ఎఫెక్ట్ తో గడిచిన ఐదారు నెలలుగా సినిమా షూటింగులు నిలిచిపోయాయి. దీంతో దర్శక నిర్మాతలు.. హీరోలు.. నటీనటుల ప్లాన్స్ అన్ని తలకిందులయ్యాయి. అయితే ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు షూటింగులకు అనుమతి ఇచ్చాయి. దీంతో టాలీవుడ్లోనూ షూటింగులు మొదలయ్యాయి.

Also Read: ‘ఆర్ఆర్ఆర్’ను ఫాలో అవుతున్న ‘ఆచార్య’.!

కరోనా నిబంధనలు పాటిస్తూ షూటింగులు చేసుకోవాలని ప్రభుత్వాలు మార్గదర్శకాలు విడుదల చేశాయి. కరోనా నిబంధనలను తూచ తప్పకుండా పాటిస్తూ నిర్మాతలు షూటింగులను ప్రారంభిస్తున్నారు. అయితే కొందరు నిర్మాతలు కరోనాను తేలిగ్గా తీసుకొని అరకొర ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పలువురు నటీనటులు కరోనా బారిపడుతుండటంతో టాలీవుడ్లో వర్గాల్లో ఆందోళన మొదలైంది.

ఇటీవల టాలీవుడ్లో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా కన్పిస్తోంది. కరోనా బారినపడిన వారి వివరాలను బయటికి పొక్కకుండా నిర్మాతలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అయితే షూటింగుల్లోనే కొందరు కరోనా బారిన పడుతుండటంతో నిర్మాతలు గత్యంతరంలేక షూటింగులను నిలిపి వేయాల్సి వస్తోంది. కరోనా సోకిన వారి తప్పించి షూటింగ్ చేద్దామన్న కూడా మిగతా వారికి ఎక్కడ వస్తుందోననే భయంతో షూటింగులను పూర్తిగా నిలిపివేస్తున్నారు.

తాజాగా ‘టక్ జగదీష్’ చిత్రబృందంలోని పలువురు కరోనా బారినపడ్డారు. దీంతో ఈ సినిమా షూటింగ్ నిలిపి వేయాల్సి వచ్చింది. షూటింగ్ స్పాట్లోని వ్యక్తులతోపాటు యూనిట్ సభ్యులకు కరోనా తేలడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. మీడియం బడ్జెట్ సినిమాల పరిస్థితిని బట్టి పెద్ద సినిమాలు షూటింగులను ప్రారంభించాలని నిర్మాతలు భావిస్తున్నారు.

Also Read: మరోసారి గొప్పతనం చాటుకున్న హీరో మహేష్ బాబు

ప్రస్తుతం టాలీవుడ్ కరోనాకు హాట్ స్పాట్ గా మారుతుండటంతో పెద్ద సినిమాల నిర్మాతలు షూటింగులను ప్రారంభించేందుకు వెనుకంజ వేస్తున్నారు. తొలుత నవంబర్లో షూటింగులను ప్రారంభించాలని అనుకున్న పెద్ద నిర్మాతలు ప్రస్తుతానికి వారి ఆలోచనను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో టాలీవుడ్ పరిశ్రమ కరోనా పరిస్థితుల నుంచి ఇప్పట్లో గట్టెక్కేలా కన్పించడం లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది.