Peddi Movie Success: పక్క రాష్ట్రంలో ఒక సినిమా హీరో ముఖ్యమంత్రి అయితే , మన ఇండస్ట్రీ కి చెందిన టాప్ హీరోలంతా క్యూలు కట్టి శుభాకాంక్షలు తెలియజేస్తారు. కానీ సొంత ఇండస్ట్రీ లో ఎవరైనా సక్సెస్ కొడితే అభినందించడానికి మాత్రం ముందుకు రారు. ఒకప్పుడు ఇలాంటి వాతావరణం ఉండేది కాదు , ఈమధ్య కాలం లో ఏమైందో ఏమో తెలియదు కానీ , స్టార్ హీరోలు పరస్పరం అభినందించుకోవడం మానేశారు. రీసెంట్ గానే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘పెద్ది’ చిత్రం విడుదలై , మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని , బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకు కేవలం అభిమానులు మాత్రమే కాదు , ఇతర హీరోల అభిమానులు కూడా ఫిదా అయిపోయారు.
అద్భుతమైన నటన , ఈసారి రామ్ చరణ్ కి కచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుందని పోస్టులు కూడా పెడుతున్నారు. ఆ రేంజ్ నటన కనబరిస్తే , స్టార్ హీరోల నుండి ఒక్క పోస్ట్ కూడా ఇప్పటి వరకు పడలేదు. స్టార్ హీరోల సంగతి పక్కన పెడితే , కనీసం మీడియం రేంజ్ హీరోలు , యంగ్ హీరోలు కూడా ఈ సినిమా పై సోషల్ మీడియా లో కామెంట్స్ చేయలేదు. ఈ చిత్రాన్ని అల్లు అర్జున్ కుటుంబం మొత్తం ప్రీమియర్ షో లోనే చూశారు. అదే విధంగా రాజమౌళి కుటుంబం కూడా చూసింది , హీరో శ్రీవిష్ణు దొంగ చాటుగా ఈ చిత్రాన్ని వీక్షించి థియేటర్ నుండి బయటకు వస్తున్న విజువల్స్ కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అయితే వీళ్లంతా ‘పెద్ది’ గురించి ఒక్కటంటే ఒక్క ట్వీట్ కూడా వెయ్యలేదు. కేవలం ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి , రామ్ చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ మాత్రమే ఈ సినిమా గురించి మాట్లాడాడు.
ప్రతీ సూపర్ హిట్ సినిమాకు టీం అభినందిస్తూ ట్వీట్లు వేసే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ‘పెద్ది’ పై మౌనం వీడలేదు. ఎందుకు వీళ్లంతా ఇంత సైలెంట్ గా ఉన్నారు ?, రామ్ చరణ్ నటన చూసి , అతను నేషనల్ అవార్డు కచ్చితంగా కొట్టేస్తాడని అభద్రతాభావం తో ఉన్నారా ?, అందుకే ఈ సినిమా విజయం పై పెదవి విప్పడం లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతం లో రంగస్థలం లో రామ్ చరణ్ అద్భుతమైన నటనకు గానూ , సోషల్ మీడియా ద్వారా సినీ సెలబ్రిటీలందరూ మెచ్చుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా రామ్ చరణ్ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఇప్పుడు వాలంతా ఎందుకు సైలెంట్ ఉన్నారు?, కనీసం భవిష్యత్తులో అయినా ఈ సినిమా గురించి స్పందిస్తారో లేదో చూడాలి.
