Prasanth Varma: ప్రశాంత్ వర్మ ‘సూపర్ ఉమెన్’గా ఏ హీరోయిన్ చేస్తుందో తెలుసా?

ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన అ సినిమాకు నేషనల్ అవార్డు కూడా లభించింది. ఇలాంటి సబ్జెక్ట్ ఉన్న సినిమాలు ఇప్పటి వరకు రాలేదు కూడా. ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా వచ్చిన కల్కి సినిమాకు దర్శకత్వం వహించారు ప్రశాంత్ వర్మ.

Written By: Swathi Chilukuri, Updated On : February 17, 2024 1:26 pm
Follow us on

Prasanth Varma: ఇండస్ట్రీలో యంగ్ డైరెక్టర్స్ ఎంతో మంది వస్తుంటారు. ఇలా ఇటీవల హనుమాన్ సినిమాతో హిట్ కొట్టారు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. నాని నిర్మాతగా వహించిన మొదటి సినిమా అ. ఈ సినిమాతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా మంచి హిట్ ను సంపాదించి ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమాగా నిలిచింది. అయితే ఈయన డిఫరెంట్ రోల్స్ లో సినిమాలు తెరకెక్కిస్తారు అని పేరు సంపాదించారు.

ఇక ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన అ సినిమాకు నేషనల్ అవార్డు కూడా లభించింది. ఇలాంటి సబ్జెక్ట్ ఉన్న సినిమాలు ఇప్పటి వరకు రాలేదు కూడా. ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా వచ్చిన కల్కి సినిమాకు దర్శకత్వం వహించారు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా కూడా హిట్ ను సాధించింది. ఇక ఈ సినిమా తర్వాత తేజ సజ్జా హీరోగా నటించిన జాంబి రెడ్డి సినిమాకు దర్శకత్వం వహించారు ఈయన. ఈ సినిమా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉండడంతో మంచి గుర్తింపును సంపాదించింది. ఇలా ఆయన సినిమాలు డిఫరెంట్ గా వస్తున్నాయి అనే టాక్ ను సొంతం చేసుకున్నాయి.

రీసెంట్ గా వచ్చిన హనుమాన్ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చి సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ప్రతి సినిమా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉండేలా తాపత్రయ పడుతుంటారు ఈ డైరెక్టర్. మరి ప్రస్తుతం ఈయన చేతిలో ఉన్న సినిమా ఏంటి అనుకుంటున్నారా? జై హనుమాన్ సినిమాకు సీక్వెల్ తో బిజీ అయ్యారు. ఇకఈయన సినిమాటిక్ పేరుతో కొన్ని సినిమాలు వస్తాయిన అని కూడా ప్రకటించారు. ఇక జై హనుమాన్ సినిమాకు సీక్వెల్ మాత్రమే కాదు మరో సినిమాకు కూడా దర్శకత్వం వహించబోతున్నారు.

ప్రశాంత్ వర్మ మరో ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నారట. ఇందులో హీరోయిన్ ఎవరు అంటూ ఎదురుచూస్తున్నారు నెటిజన్లు. క్రాక్, దూత వంటి సిరీస్ లో నటించిన జ్ఞానేశ్వరి కండ్రేగుల ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు అంటూ ఓ వార్త బయటకు వచ్చింది. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జ్ఞానేశ్వరి మాట్లాడుతూ.. ప్రశాంత్ వర్మ తనతోనే సినిమా చేస్తున్నారు అని తెలిపింది. అంటే ఈ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలో ఈమెనే నటిస్తుంది అంటూ అనుకుంటున్నారు చాలా మంది. ఇంకా కొన్ని రోజుల్లో ఈ విషయం మీద క్లారిటీ రానుంది.