Dhanush: ధ‌నుష్‌, ఐశ్వ‌ర్యల తొలి ప‌రిచ‌యం ఎలా జ‌రిగిందో తెలుసా..?

Dhanush:  సినిమా రంగంలో రోజుకో జంట విడాకులు తీసుకోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఎంత త్వ‌ర‌గా పెండ్లి పీట‌లు ఎక్కుతున్నారో అంత త్వ‌ర‌గానే చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. మొన్న‌టికి మొన్న టాలీవుడ్ మోస్ట్ ల‌వ్లీ క‌పుల్ అయిన స‌మంత‌, నాగ‌చైత‌న్య‌లు విడాకులు తీసుకోవ‌డం ఎంత‌లా సంచ‌ల‌నం రేపిందో అద‌రికీ తెలిసిందే. ఇప్పుడు త‌మిళ స్టార్ క‌పుల్స్ అయిన ధ‌నుష్‌, ఐశ్వ‌ర్యల విడాకులు తీసుకోవ‌డం ఇప్పుడు వారి అభిమాన‌ల‌ను షాక్‌కు గురి చేసింది. దీంతో అంద‌రూ ఇప్పుడు వారి వివాహం […]

Written By: Mallesh, Updated On : January 18, 2022 3:49 pm

Dhanush

Follow us on

Dhanush:  సినిమా రంగంలో రోజుకో జంట విడాకులు తీసుకోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఎంత త్వ‌ర‌గా పెండ్లి పీట‌లు ఎక్కుతున్నారో అంత త్వ‌ర‌గానే చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. మొన్న‌టికి మొన్న టాలీవుడ్ మోస్ట్ ల‌వ్లీ క‌పుల్ అయిన స‌మంత‌, నాగ‌చైత‌న్య‌లు విడాకులు తీసుకోవ‌డం ఎంత‌లా సంచ‌ల‌నం రేపిందో అద‌రికీ తెలిసిందే. ఇప్పుడు త‌మిళ స్టార్ క‌పుల్స్ అయిన ధ‌నుష్‌, ఐశ్వ‌ర్యల విడాకులు తీసుకోవ‌డం ఇప్పుడు వారి అభిమాన‌ల‌ను షాక్‌కు గురి చేసింది.

Dhanush

దీంతో అంద‌రూ ఇప్పుడు వారి వివాహం ఎలా జ‌రిగింది, అస‌లు వారి ప‌రిచ‌యం ఎక్క‌డ ఎలా మొద‌ల‌యింది అనే విష‌యాల‌ను తెలుసుకోవ‌డం కోసం నెట్టింట్లో త‌గె వెతికేస్తున్నారు. ధ‌నుష్, ఐశ్వ‌ర్య‌ల వివాహం జ‌రిగి ఇప్ప‌టికి 18 ఏండ్లు పూర్త‌వుతున్నాయి. సూప‌ర్ స్టార్ ర‌జినీ కాంత్ కూరుతు ఐశ్వర్య. వీరిద్ద‌రిదీ ప్రేమ వివాహం. ధనుష్ కాదల్ కొండై మూవీ రిలీజ్ టైమ్ లో ఐశ్వ‌ర్య‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అప్పుడు ధనుష్ ను ఆమె అభినందించారు.

ఆ త‌ర్వాత బొకే కూడా పంపిస్తూ త‌న‌కు ట‌చ్‌లో ఉండాల‌ని కోరింది. కానీ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తో ధ‌నుష్ ఆమెను పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఇక ఇలా కొన్ని నెల‌లు గ‌డిచిన త‌ర్వాత ఇద్ద‌రి మధ్య స్నేహం బ‌లంగా ఏర్ప‌డింది. చివ‌ర‌కు అది ప్రేమ‌గా మారి పెండ్లి దాక తీసుకెళ్లింది. ఇక వారి ప్రేమ విష‌యాన్ని పెద్ద‌ల‌కు చెప్పి వారి అంగీకారంతోనే పెండ్లి చేసుకున్నారు. 2004 నవంబరు 18న వీరి మ్యారేజ్ జ‌రిగింది.

Also Read: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ బయాలజీలో జాబ్స్.. నెలకు రూ.లక్ష వేతనంతో?

అప్ప‌టికి ఇంకా ధ‌నుష్ స్టార్ హీరో కాలేదు. అయినా స‌రే సూప‌ర్ స్టార్ ర‌జినీ కాంత్ వీరిద్దరి వివాహానికి ఒప్పుకుని ముందుకు వ‌చ్చాడు. ఆ స‌మ‌యంలో ధనుష్ ఏజ్ కేవలం 21. ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే.. ఐశ్వర్య రెండేళ్లు ధ‌నుష్ కంటే పెద్ద వ‌య‌స్కురాలు. ఇక యాత్రా రాజా (15 ), అలాగే లింగ రాజా (11) అనే ఇద్ద‌రు కొడుకులు వీరికి సంతానం. కాగా ఇన్నేండ్ల దాంప‌త్య జీవితం త‌ర్వాత వీరు విడిపోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

Also Read: ఇకపై ‘చిరు మేనల్లుడు బన్నీ కాదు… బన్నీ మేనమామ చిరు’ అట!

Tags