Sitara Ghattamaneni: వామ్మో మహేష్ బాబు కూతురు సితార ఇంత సంపాదిస్తుందా?

మహేష్ బాబు కు ఉన్నట్టుగానే సితారకు కూడా చాలా ఫాన్ ఫాలోయింగ్ ఉంది. తండ్రి నటించిన సినిమాల్లోని పాటలకు డాన్స్ చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటుంది.

Written By: Swathi, Updated On : January 23, 2024 2:01 pm

Sitara Ghattamaneni

Follow us on

Sitara Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తనదైన ముద్ర వేసుకున్నారు. ఈయన వారసురాలిగా వస్తున్న సితార కూడా తన అందం, టాలెంట్, మంచితనంతో సోషల్ మీడియాలో దూసుకొనిపోతుంది. ఇక మహేష్ బాబు రీసెంట్ గా గుంటూరు కారం సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా మిశ్రమ ఫలితాలు సొంతం చేసుకున్నా.. కలెక్షన్లు మాత్రం భారీగా వచ్చాయి. పది రోజుల్లోనే ఏకంగా రూ. 250 కోట్లకు పైగా వసూలు చేసింది గుంటూరు కారం. ఇది కేవలం మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్, సంక్రాంతి సీజన్ వల్లనే అని టాక్.

మహేష్ బాబు కు ఉన్నట్టుగానే సితారకు కూడా చాలా ఫాన్ ఫాలోయింగ్ ఉంది. తండ్రి నటించిన సినిమాల్లోని పాటలకు డాన్స్ చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటుంది. ఈ అమ్మడు పంచుకున్న వెంటనే మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. వేలల్లో కామెంట్లు, లక్షల్లో లైక్స్ వస్తుంటాయి. ఇక ఈ అమ్మడు తన రేంజ్ ను పెంచుకుంటుంది. రీసెంట్ గానే ఈమె యాడ్స్ లో నటించిన విషయం తెలిసిందే. ఆ యాడ్ కు వచ్చిన రెమ్యూనరేషన్ ను మొత్తం కూడా విరాళంగా ఓ చారిటీకి ఇచ్చేసింది సితార.

అయితే సితార యాడ్స్ ద్వారా సంపాదించిన విషయం తెలిసిందే. కానీ ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా కూడా చాలా సంపాదిస్తుంది. అయితే మామూలుగానే ఈ అమ్మడు ఇన్ స్టా గ్రామ్ ద్వారా లక్షల్లో సంపాదిస్తుంటుంది. ఇన్ స్టాలో ఈ అమ్మడుకు ఏకంగా 1.7 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఇక యూట్యూబ్ ఛానల్ లో 10 వేల కంటే ఎక్కువ సబ్ స్కైబర్స్ ఉన్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా బ్రాండ్, ప్రమోషన్స్ లాంటివి చేస్తుంది సితార. ఇలా మొత్తం మీద నెలకు ఏకంగా రూ. 30 లక్షలకు పైగానే సంపాదిస్తుంటుంది అని టాక్.

మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలో ఓ సాంగ్ లో మెరిసింది సితార. ఇదిలా ఉంటే ఈమె సినిమాల్లో నటించాలనుకుంటుంది అని కొన్ని ఇంటర్వ్యూలో తన మనసులోని మాట బయటపెట్టింది. అందం, మంచితనం కలుపుకొని ఉన్న సితార సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఎంతో మంది కోరుకుంటున్నారు. ఈమె రీసెంట్ గా ఆర్ఫాన్ పిల్లలకు గుంటూరు కారం సినిమాను చూపించిన విషయం తెలిసిందే.