spot_img
Homeఎంటర్టైన్మెంట్Directors at a night party: నైట్ పార్టీలో దర్శకులు.. ఫోటోలు తీసిన మాజీ...

Directors at a night party: నైట్ పార్టీలో దర్శకులు.. ఫోటోలు తీసిన మాజీ హీరోయిన్ !

Telugu Directors night partyDirectors at a night party: భారతీయ సినీ లోకంలో బాలీవుడ్ (Bollywood) దర్శకులకు మొదటి నుండి విపరీతమైన క్రేజ్ ఉండేది. కానీ కాలం మారింది, ఇప్పుడు హిందీ జనాలకు తెలుగు దర్శకులు బాగా నచ్చుతున్నారు. అందుకే, బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా తెలుగు డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు, ఈ నేపథ్యంలో కొంతమంది తెలుగు డైరెక్టర్లు బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ అక్కడే తమకంటూ ఒక గ్రూప్ ను ఏర్పాటు చేసుకున్నారు.

ఆ గ్రూప్ లోని సభ్యులు అంతా కలిసి కూర్చుని తరుచూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. అయితే, ఈ గ్రూప్ కి హెడ్ పూరి జగన్నాధ్. పూరి విజయ్ దేవరకొండతో “లైగర్” అంటూ ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. పూరితో పాటు ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో కరణ్ జోహార్ కూడా నిర్మాతగా కీలక పాత్ర పోషిస్తున్నాడు.

అయితే, కరుణ్ జోహార్, పూరికి ఒక ఆఫీస్ ఇచ్చాడు. పూరి ప్రస్తుతం తన మకాంను ఆ ఆఫీస్ కే మార్చాడు. అయితే, ముంబైకి వచ్చిన ప్రతి తెలుగు దర్శకుడికి ఇప్పుడు ఈ ఆఫీస్ ఒక అడ్డా అయిపోయింది. సరదాగా కూర్చుని పిచ్చాపాటి మాటలు కబుర్లు మాట్లాడుకుంటూ పూరితో కలిసి హ్యాపీగా పార్టీలు కూడా చేసుకుంటున్నారు.

ఇంతకీ పూరి జగన్నాధ్ తో ముంబైలో కలిసి ముచ్చట్లు పెట్టిన ఆ దర్శకులు ఎవరంటే.. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్, గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజా, హేమంత్ మధుకర్ లు పూరి ఇచ్చిన పార్టీను ఎంజాయ్ చేశారు. ఇంతకీ క్రిష్ ముంబైకి ఎందుకు వెళ్ళాడు అంటే.. ఓ హిందీ సినిమాకి ఆయన కమిట్ అయ్యాడట.

అలాగే మోహన్ రాజా చిరంజీవి “గాడ్ ఫాదర్” సినిమా కోసం నటీనటులను ఫైనల్ చేయడానికి ముంబై వెళ్లారు. ఇక అనుష్కతో నిశ్శబ్దం సినిమా తీసిన హేమంత్ మధుకర్ ప్రస్తుతం సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడు. అన్నట్టు ఈ దర్శకులంతా కలిసి ఉండగా వీరి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఎవరో తెలుసా ? బబ్లీ బ్యూటీ ఛార్మి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

Dharmendra Pradhan : ఇది విద్యార్థుల విజయం ప్రజాస్వామ్య విజయం

Dharmendra Pradhan : ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం, ముఖ్యంగా యువత గొంతు, పాలకులను నిర్ణయాలు మార్చుకునేలా చేయగలదని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణపై వ్యక్తమైన అసంతృప్తి, వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ...

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version