ఆ గ్రూప్ లోని సభ్యులు అంతా కలిసి కూర్చుని తరుచూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. అయితే, ఈ గ్రూప్ కి హెడ్ పూరి జగన్నాధ్. పూరి విజయ్ దేవరకొండతో “లైగర్” అంటూ ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. పూరితో పాటు ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో కరణ్ జోహార్ కూడా నిర్మాతగా కీలక పాత్ర పోషిస్తున్నాడు.
అయితే, కరుణ్ జోహార్, పూరికి ఒక ఆఫీస్ ఇచ్చాడు. పూరి ప్రస్తుతం తన మకాంను ఆ ఆఫీస్ కే మార్చాడు. అయితే, ముంబైకి వచ్చిన ప్రతి తెలుగు దర్శకుడికి ఇప్పుడు ఈ ఆఫీస్ ఒక అడ్డా అయిపోయింది. సరదాగా కూర్చుని పిచ్చాపాటి మాటలు కబుర్లు మాట్లాడుకుంటూ పూరితో కలిసి హ్యాపీగా పార్టీలు కూడా చేసుకుంటున్నారు.
ఇంతకీ పూరి జగన్నాధ్ తో ముంబైలో కలిసి ముచ్చట్లు పెట్టిన ఆ దర్శకులు ఎవరంటే.. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్, గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజా, హేమంత్ మధుకర్ లు పూరి ఇచ్చిన పార్టీను ఎంజాయ్ చేశారు. ఇంతకీ క్రిష్ ముంబైకి ఎందుకు వెళ్ళాడు అంటే.. ఓ హిందీ సినిమాకి ఆయన కమిట్ అయ్యాడట.
అలాగే మోహన్ రాజా చిరంజీవి “గాడ్ ఫాదర్” సినిమా కోసం నటీనటులను ఫైనల్ చేయడానికి ముంబై వెళ్లారు. ఇక అనుష్కతో నిశ్శబ్దం సినిమా తీసిన హేమంత్ మధుకర్ ప్రస్తుతం సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడు. అన్నట్టు ఈ దర్శకులంతా కలిసి ఉండగా వీరి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఎవరో తెలుసా ? బబ్లీ బ్యూటీ ఛార్మి.