Homeఎంటర్టైన్మెంట్Ks Sethu Madhavan: కమల్​ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ప్రముఖ డైరెక్టర్ మృతి

Ks Sethu Madhavan: కమల్​ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ప్రముఖ డైరెక్టర్ మృతి

Ks Sethu Madhavan: ప్రముఖ భారతీయ సినీ దర్శకుడు కేఎస్​ సేతు మాధవన్​ మరణించారు. వయసు మీద పడటంతో అనారోగ్యంతో బాధపుడుతున్న ఆయన.. 90 ఏళ్ల వయసులో శుక్రవారం ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు ముగ్గురు పిల్లలు సంతానం. భారతీయ సినీ పరిశ్రమకు ఆయన చేసిన కృషికి గానూ, 10 జాతీయ చలనచిత్ర అవార్డులు, 9 కేరళరాష్ట్ర చలనచిత్ర అవార్డులు వరించాయి.  ఈయన దర్శకత్వంలోనే 1962లో కన్నుమ్ కరాలుమ్​ సినిమాతో కమల్​హాసజ్​ చైల్డ్ ఆర్టిస్ట్​గా పరిచయమయ్యారు.  ఈ క్రమంలోనే మాధవన్ మృతికి సంతాపం తెలుపుతూ.. కమల్​హాసన్​ ట్వీట్ చేశారు.

1931 మే 15న జన్మించిన సేతు మాధవన్​.. తమిళ్​, హిందీతో బాటు తెలుగులోను పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. జీవశాస్త్రంలో గ్యాడ్యుయేట్ పూర్తి చేసిన ఆయనకు.. మొదటి నుంచే సినిమాలంటే ఎంతో ఆసక్తి ఉండేది. ఈ క్రమంలోనే తొలుత అసిస్టెంట్​ డైరెక్టర్​గా కెరీర్​ మొదలుపెట్టారు.

Also Read: మోర్ మసాలా మోర్ రొమాన్స్… విమర్శలు లెక్క చేయని నాగార్జున!

ఎల్వీ ప్రసాద్, ఏఎస్ఏ స్వామి, సుందర్ రావు, నందకర్ణి వంటి దర్శకులతో కలిసి పనిచేశారు. కెఎస్ సేతుమాధవన్ 1960లో తన మొదటి చిత్రం ‘సింఘాలీస్‌’లో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. KS సేతుమాధవన్ 1995 నుండి సినిమాలకు దూరంగా ఉంటున్నారు.ఇప్పటి వరకు ఆయన తన కెరీర్​లో 60కిపైగా సినిమాలు తెరకెక్కించారు.

Also Read: విడుదలైన “అర్జున ఫల్గుణ ” ట్రైలర్…

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular