సుడిగాలి సుధీర్ కు కరోనా సోకిందా?.. జబర్ధస్త్, ఢీ షోల పరిస్థితేంటి?

భారత్‌లో విజృంభించిన కరోనా తెలంగాణలోనూ అంతేస్థాయిలో వైరస్‌ మనుషులకు పాకింది. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే లెక్కలో తగ్గినా అంతరంగా మాత్రం వైరస్‌ ఇంకా విడిచిపెట్టలేదని తెలుస్తోంది.  కరోనా ముఖ్యంగా సినీ ప్రముఖులపై పంజా విసురుతోంది. ఇప్పటికే ఎందరో ప్రముఖులను బలి తీసుకుంది. అయినా ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఆన్‌లాక్‌ మార్గదర్శకాలను విడుదల చేస్తూ  జాగ్రత్తలతో షూటింగ్‌ జరుపుకోవచ్చని అనుమతి ఇవ్వడంతో సినిమా […]

Written By: NARESH, Updated On : October 22, 2020 11:57 am
Follow us on

భారత్‌లో విజృంభించిన కరోనా తెలంగాణలోనూ అంతేస్థాయిలో వైరస్‌ మనుషులకు పాకింది. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే లెక్కలో తగ్గినా అంతరంగా మాత్రం వైరస్‌ ఇంకా విడిచిపెట్టలేదని తెలుస్తోంది.  కరోనా ముఖ్యంగా సినీ ప్రముఖులపై పంజా విసురుతోంది. ఇప్పటికే ఎందరో ప్రముఖులను బలి తీసుకుంది. అయినా ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఆన్‌లాక్‌ మార్గదర్శకాలను విడుదల చేస్తూ  జాగ్రత్తలతో షూటింగ్‌ జరుపుకోవచ్చని అనుమతి ఇవ్వడంతో సినిమా రంగం మళ్లీ యథాస్థానానికి చేరింది.

Also Read: బిగ్ బాస్-4: ఈవారం డేంజర్ జోన్లో ఇద్దరు.? ఎవరు ఎలిమినేట్?

మొత్తంగా కరోనా తగ్గుతుందునుకుంటున్న సమయంలో మళ్లీ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో కరోనా అలజడి సృష్టిస్తోంది. నెల కిందటి నుంచి టీవీ షోలు కూడా జాగ్రత్తలతో షూటింగ్‌ను ప్రారంభించాయి. ముఖ్యంగా జనాల్లో క్రేజ్‌ సంపాదించిన ‘జబర్దస్త్‌’ ‘ఢీ’ షోలు ముందుగానే షూటింగ్‌ మొదలుపెట్టాయి.   తాజాగా ఈ షోల్లో ఉన్న ప్రముఖ ఆర్టిస్టు సుడిగాలి సుధీర్‌కు కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయినట్టు ప్రచారం సాగుతోంది.. దీంతో ఈ రెండు ప్రొగ్రాంలల్లో పాల్గొన్న వారు ఆందోళనకు గురవుతున్నారు. అయితే సుధీర్‌కు పెద్దగా లక్షణాలు లేకపోవడంతో ఆయన హోం క్వారంటైన్‌కు వెళ్లారు. అయినా ఇటీవల ఆయనతో సన్నిహితంగా ఉన్నవారికి మళ్లీ పరీక్షలు చేస్తున్నారు.

‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’లో ఆయనతో సన్నిహితంగా ఉన్న రామ్‌ప్రసాద్‌, సన్నిలకు ఇదివరకు టెస్టులు చేయించగా వారికి నెగెటివ్‌ వచ్చినట్టు తెలిసింది. . ఇక ‘ఢీ’ ప్రోగ్రాంలో ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారికీ పరీక్షలు చేయిస్తున్నారు. అయితే కొన్ని రోజులు ఈ రెండు ప్రోగ్రాములలో కొంత అంతరాయం కలిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు దాదాపు 20 రోజుల వరకు సుడిగాలి సుధీర్‌ సైతం ఈ కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సి వస్తోంది.అయితే దీనిపై సుధీర్ అధికారికంగా స్పందించలేదు. తనకు కరోనా వార్తలపై స్పందించాల్సి ఉంది.

Also Read: అతడంటే పిచ్చి అంటున్న మహేష్ బాబు హీరోయిన్..!

ఇక దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్న నిర్మాతల్లో సుధీర్‌కు పాజిటివ్‌ రావడంతో గుబులు పట్టుకుంది. పోను పోను మరింత మందికి పాజిటివ్‌ వస్తే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. పక్కాగా జాగ్రత్తలు తీసుకున్నా పాజిటివ్‌ రావడంతో సినీ ఇండస్ట్రీ అయోమయానికి గురవుతోంది.