Daggubati Abhiram: లెజెండరీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మనవడు అభిరామ్ పెళ్లి పీటలు ఎక్కుతున్నాడు. నేడు శ్రీలంకలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. ఈ వేడుకకు దగ్గుబాటి కుటుంబ సభ్యులు శ్రీలంక వెల్లడమైంది. టాలీవుడ్ సెలెబ్స్ అందరూ డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్యను పెళ్లి చేసుకున్నాడు. ఇటలీ దేశంలో మూడు రోజులు ఘనంగా వీరి వివాహం జరిగింది.
తాజాగా మరో యంగ్ హీరో పెళ్ళికి సిద్దమయ్యాడు. దగ్గుబాటి వారసుడు అభిరామ్ మూడు ముళ్ల బంధంలో అడుగుపెడుతున్నాడు. ప్రత్యూష చాపరాల మెడలో తాళి కడుతున్నాడు. వీరి పెళ్లికి శ్రీలంక వేదికైంది. నేడు శ్రీలంకలో గల అనంతార కౌలుతార అనే 5 స్టార్ రిసార్ట్ లో రాత్రి 8:50 నిమిషాలకు వివాహం జరగనుంది. అందమైన ప్రకృతి మధ్యలో ఉన్న ఈ ప్రదేశంలో కొత్త జంట నూతన వధూవరులు కానున్నారు.
ఈ పెళ్ళికి దగ్గుబాటి ఫ్యామిలీ మెంబర్స్ సురేష్ బాబు, వెంకటేష్, నాగ చైతన్యతో పాటు పలువురు హాజరయ్యారు. నిర్మాత సురేష్ బాబు చిన్న కుమారుడే అభిరామ్. పెద్దబ్బాయి రానా హీరోగా రాణిస్తున్నాడు. ఈ ఏడాది అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తేజ దర్శకత్వంలో అహింస టైటిల్ తో ఓ చిత్రం చేశారు. ఈ మూవీ దారుణ పరాజయం చవి చూసింది. ఆ చిత్రం విడుదలై చాలా కాలం అవుతుంది. అభిరామ్ మరో ప్రాజెక్ట్ ప్రకటించలేదు.
హీరోగా సెటిల్ కాకుండానే అభిరామ్ పెళ్లి చేసుకుంటున్నాడు. ఇక అభిరామ్ జీవితంలో శ్రీరెడ్డి అతిపెద్ద వివాహం. కొన్నేళ్ల క్రితం క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి పలువురు తనను శారీరకంగా వేడుకున్నారని సంచలన కామెంట్స్ చేసింది. కొందరి ప్రైవేటు భాగోతాలు బయటపెట్టింది. కాగా అభిరామ్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు శ్రీరెడ్డి లీక్ చేయడం సంచలనంగా మారింది. ఈ వివాదంలో అభిరామ్ పేరు ప్రముఖంగా వినిపించింది.