Virata Parvam: ‘విరాటపర్వం’ అని ఏమంటా పేరు పెట్టారో గానీ, దాదాపు మూడేళ్లుగా అజ్ఞాతంలోనే మగ్గిపోతూ ఉంది ఈ సినిమా. రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వస్తోన్న ఈ ‘విరాటపర్వం’ పై మంచి అంచనాలు ఉన్నాయి. మూడేళ్ళ క్రితమే విడుదల తేదీ ప్రకటించినా.. ఇంకా ఈ సినిమా విడుదల కాలేదు. ఎప్పుడో షూటింగ్ పూర్తి అయింది. ఫస్ట్ కాపీ చేతికి వచ్చి కూడా రెండేళ్లు అవుతుంది.

అయినప్పటికి ఇంకా నిర్మాతలు ఈ సినిమాను థియేటర్ లో రిలీజ్ చెయ్యాలా? లేక ఓటీటీలో రిలీజ్ చేద్దామా ? అన్న డైలమాలోనే ఉండిపోయారు. థియేటర్లు అన్ని ఓపెన్ అయ్యాక.. చిత్ర బృందానికి రిలీజ్ విషయంలో ఇంకా ఒక స్పష్టత లేకపోవడం ఆశ్చర్యకరమే. అయితే, రానా టీమ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా అవుట్ ఫుట్ విషయంలో రానా హ్యాపీగా లేడు.
అందుకే, ఈ సినిమా రిలీజ్ పై రానా మొదటి నుంచి ఆసక్తిగా లేడు. నిజానికి మొన్నటి వరకు ‘భీమ్లా నాయక్’ రిలీజ్ తర్వాత తన ‘విరాటపర్వం’ గురించి రానా ఆలోచిస్తాడేమో అని ఓ ప్రచారం జరిగింది. ‘భీమ్లా నాయక్’ సంక్రాంతికి లేదా ఏప్రిల్ లోనే విడుదల అవుతుంది. మరి ‘విరాటపర్వం’ను ఆ తర్వాత వచ్చే సమ్మర్ లో రిలీజ్ చేద్దామా ? అంటూ దర్శక నిర్మాతలు అడిగితే.. ఈ సినిమాకు ఓటీటీనే బెటర్ అంటూ రానా చెప్పినట్లు తెలుస్తోంది.
Also Read: Ghani: పవర్ఫుల్ ప్యాక్తో గని టీజర్.. వరుణ్ సిక్స్ప్యాక్కు అభిమానులు ఫిదా!
అందుకే, మొదటి నుంచి “విరాటపర్వం” సినిమాను నెట్ ఫ్లిక్స్ కి ఇచ్చేయాలని ఆ మధ్య రానా చాలా ప్రయత్నం చేశాడు. కానీ డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కు ఒప్పుకుంటే తనకు కొన్ని సమస్యలు వస్తాయని, అప్పుడు ఆ ఒప్పందాన్ని రద్దు చేశాడు సురేష్ బాబు. మరి ఇప్పటికైనా విరాటపర్వం చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయడానికి సురేష్ బాబు ఒప్పుకుంటాడేమో చూడాలి. మొత్తానికి రిలీజ్ విషయంలో “విరాటపర్వం” గందరగోళంలో ఉంది.
Also Read: Anushka: బరువు తగ్గేందుకు అనుష్క డైటింగ్ ప్లాన్.. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా!