ప‌వ‌న్ – మ‌హేష్ కాంబోపై క్లారిటీ!

సినీ ప‌రిశ్ర‌మ‌లో కొన్ని కాంబినేష‌న్లు ఎప్ప‌టికీ ఆస‌క్తిని రేకెత్తిస్తుంటాయి. అవి సెట్ అయితే చూడాల‌ని ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతుంటారు. అలాంటి వాటిల్లో ఒక‌టి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ – సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కాంబో. నిజానికి వీరిద్ద‌రూ క‌లిసి సినిమా తీయాలేగానీ.. బాక్సాఫీస్ ఏ రేంజ్ లో షేకైపోతుందో అంచ‌నా వేయ‌డం కూడా క‌ష్ట‌మే. అలాంటి కాంబినేష‌న్ సెట్ కాబోతోంద‌ని కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే.. వీరిద్ద‌రూ హీరోలుగా కాదు. మ‌హేష్ హీరోగా రాబోతున్న […]

Written By: Bhaskar, Updated On : August 10, 2021 12:07 pm
Follow us on

సినీ ప‌రిశ్ర‌మ‌లో కొన్ని కాంబినేష‌న్లు ఎప్ప‌టికీ ఆస‌క్తిని రేకెత్తిస్తుంటాయి. అవి సెట్ అయితే చూడాల‌ని ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతుంటారు. అలాంటి వాటిల్లో ఒక‌టి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ – సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కాంబో. నిజానికి వీరిద్ద‌రూ క‌లిసి సినిమా తీయాలేగానీ.. బాక్సాఫీస్ ఏ రేంజ్ లో షేకైపోతుందో అంచ‌నా వేయ‌డం కూడా క‌ష్ట‌మే. అలాంటి కాంబినేష‌న్ సెట్ కాబోతోంద‌ని కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

అయితే.. వీరిద్ద‌రూ హీరోలుగా కాదు. మ‌హేష్ హీరోగా రాబోతున్న చిత్రానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ బ్యాన‌ర్ యాడ్ కాబోతోంద‌న్న‌ది ఆ వార్త సారాంశం. ప్ర‌స్తుతం స‌ర్కారు వారి పాట‌తో బిజీగా ఉన్నాడు మ‌హేష్‌. నిన్న‌నే బ‌ర్త్ డే జ‌రుపుకున్న మ‌హేష్‌.. స‌ర్కారు వారి పాట నుంచి కిక్కేచ్చే టీజ‌ర్ ను వ‌దిలాడు. దీంతో.. ఫ్యాన్స్ సంబ‌రాల్లో మునిగిపోయారు. ఈ టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ రావ‌డంతో అభిమానులు డ‌బుల్ బొనాంజా అందుకున్నారు.

ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా వ‌చ్చేసింది. పూజా హెగ్డేను హీరోయిన్ గా సెల‌క్ట్ చేశారు. నిర్మాత‌గా త్రివిక్ర‌మ్ ఆస్థాన ప్రొడ్యూస‌ర్ రాధాకృష్ణ ఉండ‌బోతున్నారు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పైనే ఈ సినిమా తెర‌కెక్కించ‌బోతున్నారు. ఇందులోనే ప‌వ‌న్ బ్యాన‌ర్ జ‌త క‌లుస్తుంద‌నే వార్త‌లు వ‌చ్చాయి. కానీ.. ప్ర‌క‌టించిన వివ‌రాల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్ లేక‌పోవ‌డంతో.. ప‌వ‌న్‌-మ‌హేష్ కాంబో సెట్ కాలేద‌నే విష‌య‌మై క్లారిటీ వ‌చ్చేసింది.

నిజానికి మ‌హేష్ బాబు ప్ర‌తీ సినిమాకు త‌న ఎంబీ ప్రొడ‌క్ష‌న్స్ ను యాడ్ చేసి, లాభాల్లో వాటా తీసుకుంటాడు. త్రివిక్ర‌మ్ కూడా ఇలాగే తీసుకుంటున్నాడు. మ‌రి, ఇప్పుడు తివిక్ర‌మ్‌, మ‌హేష్ వాటాలు తీసుకుంటే రాధాకృష్ణ‌కు మిగిలేది అంతంతే. కాబ‌ట్టి.. ఈ సినిమాకు మ‌హేష్ డ్రాప్ అయ్యాడు. అంటే.. లాభాల్లో వాటా కాకుండా రెమ్యున‌రేష‌నే తీసుకోబోతున్నాడు. ఈ ప‌రిస్థితుల్లోనూ ప‌వ‌న్ బ్యాన‌ర్ యాడ్ కాలేద‌న్న‌ది టాక్‌. మ‌రి, రాబోయే రోజుల్లో ఏమైనా మిరాకిల్ జ‌రుగుతుందేమో చూడాలి.