Charmy Kaur: బర్త్ డే వేళ మందేస్తూ ఎంజాయ్ చేసిన ఛార్మి… రహస్యంగా అనుభవించాలంటూ ఓపెన్ కామెంట్స్

డబుల్ ఇస్మార్ట్ పూరి-ఛార్మి స్వయంగా నిర్మిస్తుండగా వారి భవిష్యత్ ఈ ప్రాజెక్ట్ పై ఆధారపడి ఉంది. ఇక ఛార్మి కెరీర్ పరిశీలిస్తే 2002లో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. టీనేజ్ కూడా దాటకుండానే ముఖానికి రంగు వేసుకుంది.

Written By: Shiva, Updated On : May 18, 2023 12:19 pm

Charmy Kaur

Follow us on

Charmy Kaur: ఒక ప్రక్క లైగర్ వివాదం కొనసాగుతోంది. ఎగ్జిబిటర్స్ ఫిల్మ్ ఛాంబర్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. లైగర్ తో నిండా మునిగిన మాకు నష్టాల్లో కొంత తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్, ఛార్మి నుండి సరైన స్పందన లేదని సమాచారం. ఈ గొడవలు ఇలా ఉండగా ఛార్మి మే 17న బర్త్ డే జరుపుకుంది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. చేతిలో వోడ్కా గ్లాస్ పట్టుకొని ఫోజిచ్చిన ఛార్మి లైఫ్ ని రహస్యంగా అనుభవించాలని కొటేషన్ కొట్టింది.

నచ్చిన ప్రదేశానికి వెళ్ళండి, నిజమైన ప్రేమను పొందండి, ఆనందంగా జీవించండి… ఇవన్నీ రహస్యంగా చేయండి. లేదంటే ఈ జనాలు మీ సంతోషాలు నాశనం చేస్తారంటూ, ఛార్మి ఓ నోట్ చేశారు. ఛార్మి బర్త్ డే పోస్ట్ వైరల్ అవుతుంది. లైగర్ ప్లాప్ తో ఛార్మి-పూరి కెరీర్ మరలా క్రిందకు పడింది. అయితే రామ్ పోతినేనితో కొత్త మూవీ ప్రకటించారు. డబుల్ ఇస్మార్ట్ టైటిల్ తో మూవీ చేస్తున్నట్లు ఇటీవల వెల్లడించారు.

డబుల్ ఇస్మార్ట్ పూరి-ఛార్మి స్వయంగా నిర్మిస్తుండగా వారి భవిష్యత్ ఈ ప్రాజెక్ట్ పై ఆధారపడి ఉంది. ఇక ఛార్మి కెరీర్ పరిశీలిస్తే 2002లో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. టీనేజ్ కూడా దాటకుండానే ముఖానికి రంగు వేసుకుంది. నీతోడు కావాలి ఛార్మి మొదటి చిత్రం. గౌరీ, మాస్, లక్ష్మీ, రాఖీ, పౌర్ణమి, చక్రం వంటి చిత్రాలు ఆమెకు ఫేమ్ తెచ్చాయి. పూరి జగన్నాధ్ కి దగ్గరయ్యాక ఛార్మి నటనకు గుడ్ బై చెప్పేశారు.

పూరి కనెక్ట్స్ బ్యానర్ స్థాపించి నిర్మాతగా మారారు. పూరి, ఛార్మి ఈ సంస్థ నిర్మాణ భాగస్వాములు. పూరి కనెక్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన మొదటి చిత్రం జ్యోతిలక్ష్మీ. అరడజనుకు పైగా చిత్రాలు చేశారు. ఇస్మార్ట్ శంకర్ మాత్రమే విజయం సాధించింది. లైగర్ విజయం సాధిస్తే ఛార్మి కథ వేరుగా ఉండేది. లైగర్ ప్లాప్ కావడంతో జనగణమన మధ్యలో ఆగిపోయింది. దర్శకుడు పూరీని నమ్ముకుని ఛార్మి ముందుకు వెళుతున్నారు.