Bollywood Heroes in South: బాహుబలికి ముందు.. బాహుబలికి తర్వాత.. అనేంతలా బాహుబలి ఇండియన్ సినిమాలో తెచ్చిన మార్పులు అన్నీఇన్నీ కావు. పాన్ ఇండియా మూవీస్ అంటూ ముందుకొస్తున్నాయంటే.. ఆ మూవీ రేంజ్ ఏ వేరు. సౌత్ సినిమా క్రేజ్ పెంచిన ఈ మూవీతో దర్శకధీరుడు ఇండయన్ ఫేమస్ డైరెక్టర్ గా అవతరించాడు. డార్లింగ్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. దీంతో సీనే మారిపోయింది. ప్రతిఒక్కరూ ఇప్పుడు టాలీవుడ్ వైపే చూస్తున్నారు. బాలీవుడ్ హీరోలు, విలన్లు, హీరోయిన్స్ అందరూ సౌత్ సినిమాలో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం మన సౌత్ సినిమాల రికార్డులను బాలీవుడ్ స్టార్ లు కూడా బ్రేక్ చేయలేకపోతున్నారు.

ఒకప్పుడు తెలుగు హీరోలు హిందీలో నటించడానికి ఆసక్తి చూపేవారు. ప్రస్తుతం సీన్ మారింది. టాలీవుడ్లో అప్పుడప్పుడు ఇతర భాషా నటులు నటించడం కూడా తెలిసిందే. కానీ ఇప్పుడు బాలీవుడ్ బడా హీరోలే.. సౌత్ సినిమాల్లో నటిస్తున్నారు. ఈ కోవలో ఇప్పటికే అజయ్ దేవ్గణ్ ఆర్ఆర్ఆర్ మూవీతో ఇక్కడి ప్రేక్షకులను పలకరించారు. మరోవైపు సల్మాన్ కూడా చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీతో సౌత్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇక సంజయ్ దత్.. కేజీఎఫ్ 2 మూవీ కంటే ముందే ఓ మూవీతో సౌత్ ఇండస్ట్రీని పలకరించినా.. ఇపుడు అధిరా..గా సౌత్ సహా పాన్ ఇండియా ప్రేక్షకులను తన నటనతో భయపెట్టారు. అంతకు ముందు సంజు భాయ్ నాగార్జున హీరోగా నటించిన చంద్రలేఖ’లో అతిథి పాత్రలో కాసేపు కనిపించారు.
Also Read: Modi Kendriya Vidyalaya: పెంచమంటే తగ్గించాడే.. మోడీ మార్క్ షాక్ ఇదీ
సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ పలు తెలుగు సినిమాల్లో అతిథి పాత్రల్లో నటించారు. అక్కినేని ఫ్యామిలీ నటించిన మనం చిత్రంలో అమితాబ్ చిన్న పాత్రలో మెరిశారు. చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువుగా గోసాయి వెంకన్న పాత్రలో కనిపించారు. మరోసారి ఈయన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కే’లో నటిస్తున్నారు.

సల్మాన్ ఖాన్.. చిరంజీవి హీరోగా నటిస్తోన్న గాడ్ ఫాదర్’ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రంతో సల్మాన్ తెలుగు ఎంట్రీ ఇవ్వనున్నారు. లూసీఫర్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన పాత్రను తెలుగులో సల్మాన్ ఖాన్ చేేస్తున్నారు. ఈ సినిమా కోసం సల్మాన్ ఖాన్ 20 రోజులు కేటాయించారు.

సైఫ్ అలీ ఖాన్.. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రామాయాణ గాథ ఆదిపురుష్ లో లంకేషుడైన రావణ బ్రహ్మ పాత్రలో నటింస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీటైంది. త్వరలో రావణుడిగా తెలుగుతో పాటు ఇండియన్ ప్రేక్షకులను పలకరించనున్నారు.

రజినీకాంత్ హీరోగా వచ్చిన దర్బార్ సినిమాలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి విలన్గా కనిపించారు. ఆ తర్వాత మంచు విష్ణు హీరోగా నటించిన మోసగాళ్లు మూవీతో పాటు తాజాగా గని సినిమాతో తెలుగు ప్రేక్షకులను సైతం పలకరించారు.
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర వన్ అండ్ టూ సినిమాలతో వివేక్ ఒబెరాయ్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇదే సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో బాలీవుడ్ షాట్గన్ శతృఘ్న సిన్హా అదరగొట్టారు . అంతకు ముందు ఒక తెలుగు సినిమాలో సిన్హా నటించారు.

బాలీవుడ్ ను దశాబ్దం పాటు ఒక్క ఊపు ఊపిన నటుడు మిథున్ చక్రవర్తి. ఇటీవలి కాలంలో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ రాణిస్తున్నారు. ఓ మై గాడ్ చిత్రానికి తెలుగు రీమేక్గా వచ్చిన గోపాల గోపాల చిత్రంలో మిథున్ చక్రవర్తి స్వామిజీ పాత్రలో నటించారు. జాకీష్రాఫ్ తెలుగులో ‘అస్త్రం’,శక్తి’, ‘పంజా’ చివరగా ‘సాహో’లో నటించారు.

బాలీవుడ్కి హీరోగా పరిచయమైనా.. ఆ తర్వాత విలన్ పాత్రలు కూడా పోషించిన నటుడు నీల్ నితిన్ ముఖేష్. ఆయన ప్రభాస్ నటించిన సాహో చిత్రంలో నెగటివ్ క్యారెక్టర్ లో కనిపించారు. హిందీతో పాటు భోజ్పూరీ భాషల్లో హీరోగా నటించిన రవికిషన్.. అనేక తెలుగు చిత్రాల్లో నటించారు. రేసుగుర్రం, కిక్ 2 లాంటి చిత్రాలు తనకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఒకప్పుడు బాలీవుడ్లో శశి కపూర్ తర్వాత సెకండ్ హీరోగా ఫేమసైన చుంకీ పాండే ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాతో విలన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.

బాలీవుడ్ తొలి సూపర్ స్టార్ రాజేష్ ఖన్నాకూడా నాగేశ్వరరావు, వాణిశ్రీ జంటగా నటించిన బంగారు బాబులో గెస్ట్ అప్ఫీరియన్స్ ఇచ్చారు. ఆ తర్వాత కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన అడవి దొంగలో ఒక పాటలో మెరిసారు.
Also Read:JanaSena Party: ఉత్తరాంధ్ర జనసేనకు ఆయువు పట్టుగా మారుతోందా?
[…] RRR vs KGF 2 Box Office Collection: షార్ప్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వచ్చిన`కేజీఎఫ్ చాప్టర్- 2` ఈ రోజు బాక్సాఫీస్పై దాడి చేసింది. అయితే హిందీ బెల్ట్లో RRR చిత్రం తొలి రోజు రూ. 20 కోట్లకుపైగా వసూలు చేయగా, KGF2 దానికి రెట్టింపు వసూలు చేసింది. సుమారు రూ. 45 కోట్లు తొలిరోజే కలెక్షన్స్ రాబట్టింది. ఆల్ ఓవర్గా తీసుకుంటే మొదటి రోజు రూ. 100 కోట్లు కలెక్ట్ చేసింది. […]
[…] Hanuman Pooja: హనుమాన్ జయంతి ఈనెల 16న రానుంది. దీని కోసం ఇప్పటినుంచే భక్తులు ఎదురు చూస్తున్నారు. హనుమాన్ జయంతి రోజు ఆయనను కొలిస్తే అన్ని కష్టాలు తొలగి సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఆ రోజు దేవాలయాలు కిటకిటలాడతాయి. భక్తులతో నిండిపోతాయి. హనుమాన్ భక్తులతో గుళ్లు సందడిగా మారుతాయి. ఈ రోజు ఆంజనేయుడిని పూజించడంతో ఇబ్బందులు తొలగుతాయని నమ్ముతారు. ఈ సంవత్సరం జయంతి శనివారం రావడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. […]
[…] Mumbai Indians IPL 2022: ఐపీఎల్ సీజన్లో చెత్త గా ఆడి రికార్డులు సొంతం చేసుకుంటోంది ముంబై ఇండియన్స్. ఐదుసార్లు చాంపియన్ గా నిలిచినా ప్రస్తుతం మాత్రం ఆ స్థాయిలో ఆడకుండా చెత్తగా ఆడుతూ తనలోని లోపాలను బహిర్గతం చేసుకుంటోంది. ఐదు సార్లు టైటిల్ గెలిచిన జోరు మాత్రం కనిపించడం లేదు. ఫలితంగా అప్రదిష్ట మూటగట్టుకుంటోంది. 2013, 2015, 2017, 2019, 2020లో చాంపియన్ షిప్ కైవసం చేసుకున్న జట్టు ప్రస్తుతం మాత్రం ఇబ్బందుల్లో పడుతోంది. ఓటమిలతోనే కాలం వెళ్లదీస్తోంది. దీంతో అభిమానుల చీత్కారాలకు గురవుతోంది. […]