Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu Season 7: రతికాకు ఇచ్చి పడేసిన నాగ్, క్షమాపణ చెప్పిన గౌతమ్,...

Bigg Boss Telugu Season 7: రతికాకు ఇచ్చి పడేసిన నాగ్, క్షమాపణ చెప్పిన గౌతమ్, పవర్ అస్త్ర ఆ కంటెస్టెంట్ కి!

Bigg Boss Telugu Season 7: వీకెండ్ వచ్చిందంటే హోస్ట్ నాగార్జున వచ్చేస్తారు. ఆయన వారం రోజుల పాటు జరిగిన విషయాలపై రివ్యూ చేస్తారు. హౌస్లో 13 మంది కంటెస్టెంట్స్ ఉండగా వాళ్లకు నాగార్జున మీటర్ చూపిస్తూ రేటింగ్ ఇచ్చాడు. కింగ్స్ మీటర్లో రెడ్, ఆరంజ్, గ్రీన్ కలర్స్ ఉన్నాయి. మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చిన కంటెస్టెంట్స్ కి గ్రీన్ కలర్, పర్లేదు అన్నట్లు ఆడినవారికి ఆరంజ్ కలర్, సరిగా ఆడని కంటెస్టెంట్స్ కి రెడ్ కలర్ వద్ద మీటర్ ముల్లు ఉంచి నాగార్జున క్లాస్ పీకాడు.

కీలకమైన రెండో పవర్ అస్త్ర శివాజీకి దక్కింది. రేసులో ఉన్న అమర్ దీప్, షకీలా, శివాజీ గట్టిగా బిగ్ బాస్ అని అరవాల్సి ఉంది. అందరికంటే బిగ్గరగా అరిచిన శివాజీ సొంతం చేసుకున్నాడు. దాంతో అతడికి నాలుగు వారాల ఇమ్యూనిటీ లభించింది. చాలా బాగా ఆడుతున్నావ్ అని నాగార్జున కింగ్స్ మీటర్ లో గ్రీన్ వద్ద ముల్లు ఉంచాడు నాగార్జున. అదే సమయంలో పదే పదే ఇంటి నుండి వెళ్ళిపోతాను అంటున్నందుకు ఆరంజ్ ఇచ్చాడు. ఇక రైతుబిడ్డను టార్గెట్ చేసినందుకు అతన్ని కించపరిచేలా మాట్లాడినందుకు అమర్ దీప్ ని కూడా మందలించాడు. పెర్ఫార్మన్స్ పరంగా గ్రీన్ ఇచ్చాడు.

ఆట సందీప్ పెర్ఫార్మన్స్ పట్ల కూడా నాగార్జున పాజిటివ్ గా స్పందించాడు. ప్రియాంక, శోభా శెట్టి పెర్ఫార్మన్స్ పై పెదవి విరిచాడు. వాళ్లకు మీటర్ లో రెడ్ మార్క్ చూపించాడు. అలాగే పల్లవి ప్రశాంత్ పెర్ఫార్మన్స్ పట్ల నిరాశ వ్యక్తం చేశాడు. పల్లవి ప్రశాంత్ కి నాగార్జున ఇచ్చిన మొక్క ఎండిపోయింది. ఒక మొక్కను చేసుకోలేని వాడివి రైతుబిడ్డ ఎలా అవుతావని ప్రశ్నించాడు. పల్లవి ప్రశాంత్ కి కూడా రెడ్ మార్క్ ఇచ్చాడు.

ప్రిన్స్ యావర్ ని నాగార్జున మెచ్చుకున్నారు. అయితే సహనం కోల్పోయి అరవడం నచ్చలేదన్నాడు. అతనిది స్టెరాయిడ్స్ బాడీ అని పర్సనల్ కామెంట్స్ చేసిన గౌతమ్ కృష్ణపై నాగార్జున మండిపడ్డాడు. ప్రిన్స్ కి గౌతమ్ కృష్ణ చేత క్షమాపణలు చెప్పించాడు. టేస్టీ తేజా పెర్ఫార్మన్స్ కూడా బాగోలేదని నాగార్జున అన్నారు. అతనికి కింగ్స్ మీటర్ లో రెడ్ మార్క్ చూపించాడు. ఇక శుభశ్రీకి ఆరంజ్ కలర్ దక్కింది.

రతికా మీద నాగార్జున ఫైర్ అయ్యాడు. ఇండివిడ్యువల్ గా నువ్వు నీ గేమ్ ఆడుకో, టీమ్ గేమ్లో నువ్వు వాళ్లతో కలిసి ఆడాలి. నీ మొండితనంతో ఇబ్బంది పెట్టకూడదు. బఫూన్స్ అంటే అర్థం తెలుసా అని నాగార్జున ఆమెపై అసహనం వ్యక్తం చేశాడు. పెర్ఫార్మన్స్ పరంగా ఆరంజ్ మార్క్ ఇచ్చారు. షకీలాను పదే పదే వయసు గుర్తు చేసుకోకు అన్నారు.

ఎపిసోడ్ చివర్లో నాగార్జున ఒకరిని సేవ్ చేశాడు. ఎలిమినేషన్స్ లో ఉన్న 9 మంది కంటెస్టెంట్స్ ని నిలబడమన్నారు. శివాజీ పవర్ అస్త్ర గెలుచుకున్న నేపథ్యంలో అతడు ఆటోమేటిక్ గా సేవ్ అయ్యాడు. మిగిలిన 8 మందికి చిన్నపాటి బాక్సులు ఇచ్చారు. సదరు బాక్సులో రెడ్ కలర్ ఉంటే నాట్ సేఫ్, గ్రీన్ కలర్ ఉంటే సేఫ్ అన్నారు. అమర్ దీప్ కి మాత్రమే గ్రీన్ కలర్ వచ్చింది. దాంతో అతడు సేవ్ అయ్యాడు. పల్లవి ప్రశాంత్, షకీలా, తేజా, రతికా రోజ్, ప్రిన్స్ యావర్, గౌతమ్ కృష్ణ, శోభా శెట్టి నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Weight Loss

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
HYDRA Ranganath

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ కు రాం రాం.. తెలంగాణ హైకోర్టు సంచలనం

HYDRA Ranganath: హైడ్రా.. తెలంగాణలో 2023లో కొలువుదీరిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువులు, కుంటల ఆక్రమణల తొలగింపు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అదించేందుకు ఏర్పాటు...
Kerala Innovation

Kerala Innovation: అమ్మ కష్టం చూడలేక.. ఈ కొడుకు చేసిన పని.. ఏకంగా సీఎం చప్పట్లు కొట్టాడు..

Kerala Innovation: ఉదయం లేవగానే ఇల్లు ఊడ్చి.. కల్లాపి చల్లాలి. ముగ్గు పెట్టాలి. బట్టలు ఉతకాలి. టీ దగ్గర నుంచి మొదలు పెడితే కూర వరకు వండాలి. ఇంటిని శుభ్రం చేయాలి. ఇన్ని...
Arunachalam Moksha Margam

Arunachalam Moksha Margam: అరుణాచలం మోక్షమార్గం.. తెలుగు భక్తులకే ఎందుకీ కష్టాలు..

Arunachalam Moksha Margam: అప్పుడెప్పుడో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అరుణాచలంలో ప్రదక్షిణలు చేయాలని.. మోక్ష మార్గం నుంచి బయటికి రావాలని పిలుపునిచ్చారు. ఆయన చెప్పడమే ఆలస్యం తెలుగు భక్తులు అప్పటినుంచి...
Suryakumar Yadav

Suryakumar Yadav: సూర్య కుమార్ యాదవ్.. నీ కష్టం పగ వాడికి కూడా రావద్దు బ్రో

Suryakumar Yadav:  అతడి నాయకత్వంలో టీమిండియా టి20 లలో ఒక్క ట్రోఫీ కూడా కోల్పోలేదు.. చివరికి టి20 వరల్డ్ కప్ కూడా సాధించింది. 2024లో రోహిత్ నాయకత్వంలో టీమిండియా అద్భుతం చేస్తే.. 2026లో...
Oktelugu Epaper