Bigg Boss Telugu 8: అందరికంటే తక్కువ ఓటింగ్ వచ్చిన కంటెస్టెంట్ పృథ్వీ..కానీ గౌతమ్ ని టార్గెట్ చేయడం వెనుక ఇంత స్ట్రాటజీ ఉందా!

గౌతమ్ అయితే ఒక్క క్షణం బ్లాంక్ లో ఉండిపోయాడు. టేస్టీ తేజ హాల్ లో కూర్చొని అసలు ఏమి జరుగుతుంది రా బయట అని అంటాడు. ఎందుకంటే గత వారం గౌతమ్ ఎంత అద్భుతంగా ఆడాడో మన అందరికీ తెలిసిందే.

Written By: Vicky, Updated On : October 21, 2024 7:28 am

Bigg Boss Telugu 8(134)

Follow us on

Bigg Boss Telugu 8: ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎవ్వరూ ఊహించని విధంగా మణికంఠ ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన కావాలని కోరుకొని ఎలిమినేట్ అయ్యాడు కాబట్టి, ఈ ఎలిమినేషన్ ని అన్యాయం అని ఆయన అభిమానులు అనేందుకు వీలు లేదు. మణికంఠ ని హౌస్ లోనే ఉంచేందుకు నాగార్జున, బిగ్ బాస్ టీం ఎంతో ప్రయత్నం చేసారు. కానీ ఆయన బయటకి వెళ్లేందుకే ఎక్కువగా మొగ్గు చూపారు. ఓటింగ్ పరంగా అయితే మణికంఠ డేంజర్ జోన్ లో లేడు. టాప్ 4 స్థానం లో ఉన్నాడు. గత వారంలో అందరి కంటే తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్ పృథ్వీ రాజ్ శెట్టి. కానీ అతన్ని కాకుండా గౌతమ్ ని ఎలిమినేషన్ రౌండ్ లో పెట్టడం, ఆడియన్స్ ఓట్ల ప్రకారం ఆయన ఎలిమినేట్ అయ్యినట్టు చూపించడం హౌస్ లో ఉన్న అందరికీ షాక్ కి గురి అయ్యేలా చేసింది.

గౌతమ్ అయితే ఒక్క క్షణం బ్లాంక్ లో ఉండిపోయాడు. టేస్టీ తేజ హాల్ లో కూర్చొని అసలు ఏమి జరుగుతుంది రా బయట అని అంటాడు. ఎందుకంటే గత వారం గౌతమ్ ఎంత అద్భుతంగా ఆడాడో మన అందరికీ తెలిసిందే. ప్రతీ టాస్కులోను తన వైపు నుండి వంద శాతం ఇచ్చాడు. ముఖ్యంగా మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ లో గౌతమ్ చిరుత పులి లాగా రెచ్చిపోయాడు. ఒక్కడే 11 మందిని ఒంటిచేతితో ఓడించి టాస్కు గెలిచి మెగా చీఫ్ అయ్యాడు. మెగా చీఫ్ అయిన వెంటనే తన మార్కుని చూపిస్తూ, హౌస్ లో ఉన్న అమ్మాయిలకు ఇంటి పనుల నుండి విముక్తి కలిగించాడు. హరితేజ, గంగవ్వ వంటి వారిని మినీ చీఫ్స్ గా ప్రకటించాడు. ఇలా అన్ని విధాలుగా గౌతమ్ కి ఈ వారం పాజిటివ్ ఎపిసోడ్స్ పడ్డాయి. సోషల్ మీడియా ఓటింగ్ లో కూడా గౌతమ్ టాప్ 3 లేదా, టాప్ 2 రేంజ్ లో ఓటింగ్ పడింది. అలాంటి గౌతమ్ డేంజర్ జోన్ లో ఉన్నాడు అనే విషయాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే గౌతమ్ ని ఎలిమినేట్ అయ్యినట్టు ఉద్దేశపూర్వకంగానే చూపించినట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్.

గౌతమ్ గేమ్స్ బాగానే ఆడుతున్నాడు కానీ, అతను ఈమధ్య ఎక్కువగా యష్మీ వెంట పడడం మొదలు పెట్టాడు. యష్మీ బయటకి ఇబ్బంది లేనట్టు గా వ్యవహరించినప్పటికీ, గౌతమ్ ఆమెతో పులిహోర కలుపుతున్నప్పుడల్లా యష్మీ ఇబ్బందిగా ఫీల్ అవ్వడం ఆడియన్స్ కి కనిపించింది. అంతే కాకుండా యష్మీ కి నిఖిల్ అంటే చాలా ఇష్టం అనే విషయం గౌతమ్ కి తెలుసు, అయినప్పటికీ కూడా గౌతమ్ అలా ప్రవర్తించడం ఆడియన్స్ కి నచ్చడం లేదు. అందుకే బిగ్ బాస్ ఇలాంటి పనికిమాలిన వాటి మీద గౌతమ్ ద్రుష్టి మరలకుండా, కేవలం ఆట మీద ఫోకస్ పెంచడం కోసమే ఎలిమినేట్ అయ్యినట్టు చూపించి గౌతమ్ లో ఫైర్ పెంచేందుకే ఇలా చేసారని టాక్ వినిపిస్తుంది.