Bigg Boss Telugu 8: యష్మీ, గౌతమ్, నిఖిల్ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ గురించి నాగార్జున కి పూస గుచ్చినట్టు చెప్పిన పృథ్వీ..పరువు పోయిందిగా!

పూర్తి మ్యాటర్ చెప్పేస్తే ప్రైజ్ మనీ కి 50 వేల రూపాయిలు అదనంగా జమ చేస్తామని అంటాడు నాగార్జున. దీంతో పృథ్వీ గౌతమ్, నిఖిల్, యష్మీ మధ్య జరుగుతున్న ట్రైయాంగిల్ లవ్ స్టోరీ మొత్తాన్ని చెప్పేసాడు. ఆయన మాట్లాడుతూ 'ఆరోజు యష్మీ గౌతమ్ ని టీ షర్ట్ అడిగి తీసుకుంది.

Written By: Vicky, Updated On : October 27, 2024 9:18 am

Bigg Boss Telugu 8(164)

Follow us on

Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో మనసులో ఒకటి పెట్టుకొని పైకి వేరేలా మాట్లాడే కంటెస్టెంట్స్ చాలా మంది ఉన్నారు. కానీ పృథ్వీ మాత్రం మనసులో ఏముందో బయట కూడా అదే మాట్లాడుతాడు. పృథ్వీ స్థాయి నిజాయితితో హౌస్ లో ఒక్క కంటెస్టెంట్ కూడా లేరు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అప్పుడప్పుడు మితిమీరిన కోపం చూపిస్తాడు అనే కంప్లైంట్ మాత్రమే ఉంది తప్ప, మిగిలిన సమయాల్లో ఆయన చాలా పర్ఫెక్ట్ గా ఉంటాడు. టాస్కుల విషయం లో సింహం లాగా రెచ్చిపోయే పృథ్వీ, కష్టపడి తన టీం ని గెలిపించిన తర్వాత తనకి సంబంధం లేదు అన్నట్టుగా ఉండడం అందరికీ బాగా నచ్చింది. అది ఆడియన్స్ కి బాగా నచ్చబట్టే ఇన్ని రోజులు ఆయన బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతూ వచ్చాడు. నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున ఆయన నిజాయితీకి ఒక పరీక్ష పెట్టాడు. యష్మీ గౌతమ్ టీ షర్ట్ ని వేసుకోవడం గురించి పృథ్వీని అడుగుతాడు.

పూర్తి మ్యాటర్ చెప్పేస్తే ప్రైజ్ మనీ కి 50 వేల రూపాయిలు అదనంగా జమ చేస్తామని అంటాడు నాగార్జున. దీంతో పృథ్వీ గౌతమ్, నిఖిల్, యష్మీ మధ్య జరుగుతున్న ట్రైయాంగిల్ లవ్ స్టోరీ మొత్తాన్ని చెప్పేసాడు. ఆయన మాట్లాడుతూ ‘ఆరోజు యష్మీ గౌతమ్ ని టీ షర్ట్ అడిగి తీసుకుంది. ఆ తర్వాత నిఖిల్ కి మండుతుందా లేదా, అసూయ పడుతున్నాడా అని నన్ను అడిగేది. కేవలం నిఖిల్ ని ఉడికించడం కోసం మాత్రమే గౌతమ్ టీ షర్ట్ తీసుకుంది. మొత్తం ఎలా జరుగుతుందంటే ఆరోజు హౌస్ లో A వచ్చి B పై వాలే, B వచ్చి C పై వాలే అనే పాట వచ్చింది. ఆ పాట వీళ్ళ ముగ్గురికి పర్ఫెక్ట్ గా సరిపోతుంది’ అని చెప్పాడు. ఇక్కడ A అంటే గౌతమ్, B అంటే యష్మీ, C అంటే నిఖిల్.

గౌతమ్ కి యష్మీ అంటే మొదటి నుండి ఇష్టం ఉంది, కానీ యష్మీ కి నిఖిల్ అంటే పిచ్చి. నిఖిల్ కి కూడా యష్మీ అంటే ఇష్టం ఉంది కానీ, ఇష్టం లేనట్టుగా ప్రవర్తిస్తున్నాడు. అయితే వీళ్ళ ముగ్గురిలో ఎర్రివాడు అయ్యింది మాత్రం గౌతమ్. నిఖిల్ ని యష్మీ ఇష్టపడుతుందనీ, కేవలం నిఖిల్ అసూయ పడడం కోసం మాత్రమే యష్మీ గౌతమ్ తో క్లోజ్ గా ఉన్నట్టు వ్యవహరిస్తుందనే విషయం గౌతమ్ కి తెలియదు. నిన్న పృథ్వీ చెప్తేనే తెలిసింది. ఇది విన్న తర్వాత గౌతమ్ ‘పృథ్వీ సరైన కుండనే బద్దలు కొట్టాడు సార్’ అని అంటాడు. ఇది మొత్తం నిన్నటి ఎపిసోడ్ లో సరదాగా సాగిపోయింది కానీ, ఈ విషయం పై యష్మీ కి నామినేషన్స్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే యష్మీ చేసింది చాలా తప్పు, ఒకరి ఎమోషన్స్ తో ఆడుకొని, మరొకరికి దగ్గర అవ్వాలని అనుకోవడం మామూలు విషయం కాదు.