Bigg Boss Telugu 8: దీపావళి ఎపిసోడ్ లో డబుల్ ధమాకా..ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ హౌస్ లోకి రీ ఎంట్రీ?

ఈ ట్విస్ట్ షో ని పాతాళ లోకంలోకి తీసుకెళ్లింది. గత వారం వరకు జరిగిన టాస్కులు కూడా స్టార్ మా పరివారం, స్టార్ మహిళ వంటి షోస్ లో నిర్వహించినవే. అసలు సిసలు బిగ్ బాస్ హౌస్ టాస్క్ అంటే నిన్నటి ఎపిసోడ్ లో జరిగినదే. ఆ ఎపిసోడ్ ద్వారా బోలెడంత కంటెంట్ వచ్చింది. ఇదంతా పక్కన పెడితే ప్రతీ ఏడాది దీపావళి ఎపిసోడ్ ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తారు బిగ్ బాస్ టీం. ఈ ఏడాది కూడా అదే విధంగా ప్లాన్ చేసారు.

Written By: Vicky, Updated On : October 25, 2024 4:51 pm

Bigg Boss Telugu 8(61)

Follow us on

Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో ట్విస్టులు, ఎంటర్టైన్మెంట్ అన్ లిమిటెడ్ గా ఉంటాయని నాగార్జున షోకి ముందు పదే పదే ఊదరగొట్టేవాడు. కానీ ఆయన చెప్పినవి ఇప్పటి వరకు ఆడియన్స్ కి కనిపించలేదు. హౌస్ లోకి గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ద్వారా కేవలం 14 మందిని లోపలకు పంపినప్పుడే అందరికీ అర్థమైంది వైల్డ్ కార్డ్స్ ఉంటాయని,ఇక అందులో ట్విస్ట్ ఏముంది…?, కానీ ఇక్కడ ఆడియన్స్ కి తెలిసిన ఒక కొత్త విషయం ఏమిటంటే, పాత సీజన్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ రావడం. అలాగే ఎంటర్టైన్మెంట్ అన్ లిమిటెడ్ అన్నారు, అది కూడా జరగడం లేదు. గత సీజన్ లో అమర్ దీప్, శివాజీ మధ్య కామెడీ టైమింగ్ చాలా ఆర్గానిక్ గా ఉండేది. ఈ సీజన్ లో ఎంటర్టైన్మెంట్ కోసం భారీ రెమ్యూనరేషన్స్ ని ఇచ్చి అవినాష్, రోహిణి వంటి వారిని తీసుకొచ్చారు కానీ, సీజన్ 7 రేంజ్ ఎంటర్టైన్మెంట్ మాత్రం దొరకడం లేదు. ఈ సీజన్ మొత్తం మీద ఆడియన్స్ నిజంగా షాక్ కి గురైన అంశం ఏదైనా ఉందా అంటే, అది మణికంఠ ఎలిమినేషన్ అని చెప్పొచ్చు.

ఈ ట్విస్ట్ షో ని పాతాళ లోకంలోకి తీసుకెళ్లింది. గత వారం వరకు జరిగిన టాస్కులు కూడా స్టార్ మా పరివారం, స్టార్ మహిళ వంటి షోస్ లో నిర్వహించినవే. అసలు సిసలు బిగ్ బాస్ హౌస్ టాస్క్ అంటే నిన్నటి ఎపిసోడ్ లో జరిగినదే. ఆ ఎపిసోడ్ ద్వారా బోలెడంత కంటెంట్ వచ్చింది. ఇదంతా పక్కన పెడితే ప్రతీ ఏడాది దీపావళి ఎపిసోడ్ ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తారు బిగ్ బాస్ టీం. ఈ ఏడాది కూడా అదే విధంగా ప్లాన్ చేసారు. అందుకే శనివారం ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ ని ఈరోజే పూర్తి చేసారు. ప్రముఖ తమిళ హీరో సూర్య తన లేటెస్ట్ చిత్రం ‘కంగువ’ ప్రొమోషన్స్ లో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఆయన కోసం హౌస్ మేట్స్ మొత్తం పైర్స్ గా మారి స్పెషల్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు.

ఇదంతా పక్కన పెడితే ఈ దీపావళి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఆడియన్స్ కి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసాడట. హౌస్ లోకి ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ లో ఇద్దరినీ ఎంచుకొని లోపలకు పంపబోతున్నారట. మణికంఠ రీ ఎంట్రీ ని చాలా మంది కోరుకుంటున్నారు కానీ అది జరగదట. రీ ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్స్ లో సోనియా, సీత, ఆదిత్య ఓం పేర్లు ఉన్నాయి. ఈ ముగ్గురిలో ఇద్దరు హౌస్ లోపలకు వెళ్ళబోతున్నారట. సోనియా హౌస్ లోకి రీ ఎంట్రీ ఇస్తే మాత్రం యష్మీ, నిఖిల్..అలాగే పృథ్వీ, విష్ణు ప్రియ ప్రేమజంటలు విడిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే ఆదిత్య ఓం గేమ్ బాగా ఆడడం మొదలు పెట్టిన వారంలోనే బయటకి వెళ్లాల్సి వచ్చింది, ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తే ఆయన ఫైర్ మీద గేమ్ ఆడే అవకాశం ఉంది.