Bigg Boss 7 Telugu : గుడ్డు గేమ్ లో నెగ్గేదెవరు… భలే ఫిట్టింగ్ పెట్టిన బిగ్ బాస్!

ఒకరి చేతి నుంచి మరొకరు మార్చుకుంటూ గుడ్లు గూడులో పెట్టారు. ఈ క్రమంలో యావర్ చేతిలో ఉన్న గుడ్డు జారి పడిపోయింది.

Written By: NARESH, Updated On : October 18, 2023 7:51 pm
Follow us on

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ ఈ వారం హౌస్ మేట్స్ ని రెండు టీములుగా చేశాడు. జిలేబి పురం -గులాబీ పురం అని పేర్లు పెట్టాడు. ఏ ఊరి వాళ్ళు అయితే గ్రహాంతర వాసులని సంతోష పరుస్తారో కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలుస్తారు. ఇక హౌస్ మేట్స్ వారి వారి పాత్రలకు తగినట్టు గెటప్ వేసుకున్నారు. ఎవరికి వారు పర్ఫామెన్స్ అదరగొట్టేసారు. ఇక ఆ తర్వాత గ్రహాంతర వాసులను సంతోష పరిచేందుకు రెండు ఊళ్ళకి ఒక టాస్క్ పెట్టాడు బిగ్ బాస్.

టాస్క్ లో భాగంగా ఒక రౌండ్ బోర్డు మీద గుడ్డు ను పెట్టుకుని కింద పడకుండా బ్యాలెన్స్ చెయ్యాలి. యాక్టివిటీ ఏరియాలో ఏర్పాటు చేసిన గూడులో పెట్టాలి. దారిలో ఉన్నా తాడులు,టైర్లు లాంటి అడ్డంకుల్ని దాటుకుని వెళ్లాలి. అలా ఏ టీమ్ వాళ్ళైతే ఇచ్చిన సమయంలో ఎక్కువ గుడ్లు గూడులో పెడతారో వాళ్ళు విజేతలుగా నిలుస్తారు.ఈ టాస్క్ కు సంచాలక్ గా శివాజి ని పెట్టారు. ఇక టాస్క్ మొదలవగానే కంటెస్టెంట్స్ బోర్డు పై గుడ్డు పెట్టుకుని బ్యాలెన్స్ చేస్తూ తెగ టెన్షన్ పడ్డారు.

ఒకరి చేతి నుంచి మరొకరు మార్చుకుంటూ గుడ్లు గూడులో పెట్టారు. ఈ క్రమంలో యావర్ చేతిలో ఉన్న గుడ్డు జారి పడిపోయింది. టాస్క్ లో ఎవరు గెలిచారు అని తెలియాలంటే ఎపిసోడ్ చూస్తేనే క్లారిటీ వస్తుంది. దీన్ని పక్కన పెడితే, ఉల్టా పుల్టా ట్విస్ట్ అంటూ బిగ్ బాస్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ రతిక,దామిని,శుభ శ్రీ ల లో ఒకరి రీ ఎంట్రీ కోసం పోలింగ్ జరిపారు.ఇందులో కూడా ఒక ట్విస్ట్ పెట్టారు.

ఎవరికైతే తక్కువ ఓట్లు వస్తాయో ఆ కంటెస్టెంట్ రీ ఇస్తుంది అని షాక్ ఇచ్చారు నాగార్జున.దీన్ని బట్టి రతిక రీ ఎంట్రీ ఇస్తుంది అని వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ న్యూస్ తెగ వైరల్ గా మారింది. అదే కనుక జరిగితే ఇక హౌస్ లో రచ్చ రచ్చే. చూడాలి మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో.