Bigg Boss 7 Telugu: భోలేను సమర్ధించిన శివాజీ…రగిలిపోయిన లేడీ విలన్!

నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత భోలే ప్రియాంక ఇంకా శోభా ను క్షమాపణ కోరాడు. దానికి వారు ఒప్పుకోలేదు.దానిని రీజన్ గా చెప్తూ శివాజీ శోభా ను నామినేట్ చేశాడు.

Written By: NARESH, Updated On : October 23, 2023 6:12 pm
Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ఆసక్తికరంగా సాగుతుంది.ఇప్పటికే ఏడు వారాలు పూర్తి చేసుకుంది.ఇక ఎనిమిదో వారం నామినేషన్ ప్రక్రియ కు రంగం సిద్ధమైంది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా కంటెస్టెంట్స్ అనర్హులు అని భావించిన ఇద్దరు సభ్యుల పేర్లు చెప్పి వారి ఫోటోలు మంటలో వేయాల్సి ఉంటుంది. వారు ఎందుకు అనర్హులో తగిన కారణాలు వివరించాలి అని బిగ్ బాస్ చెప్పారు. ముందుగా శివాజీ,శోభా ను నామినేట్ చేశారు. గత వారం నామినేషన్స్ లో భోలే,శోభా నామినేట్ చేసే సమయంలో బూతులు మాట్లాడిన సంగతి తెలిసిందే.దానికి శోభా,ప్రియాంక భోలే తో గొడవ పడ్డారు.

నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత భోలే ప్రియాంక ఇంకా శోభా ను క్షమాపణ కోరాడు. దానికి వారు ఒప్పుకోలేదు.దానిని రీజన్ గా చెప్తూ శివాజీ శోభా ను నామినేట్ చేశాడు.అతను సారీ చెప్పాడు కదా,మనతోటి మనిషేగా క్షమిస్తే ఏం పోతుంది అని శివాజీ అన్నారు. దాంతో శోభా నాకు క్షమించే గుణం లేదు అన్న అని బదులిచ్చింది. కామన్ సెన్స్ కూడా ఉండదు నామినేట్ చేస్తారు అని గొణిగింది. శోభా ఫోటో తీసుకెళ్లి మంటలో వేసాడు శివాజీ.

ఆ తర్వాత గౌతమ్,పల్లవి ప్రశాంత్ ను నామినేట్ చేశాడు.పూజ గత వారం ప్రశాంత్ ను కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించి ,వేరే వాళ్లకి కూడా ఛాన్స్ రావాలి అనే ఉద్దేశంతో చెప్పాను అని చెప్పింది.అని పాయింట్ రైజ్ చేశాడు గౌతమ్. దంతో ప్రశాంత్ బుక్కు లో ఏముంది,నాకు సరైన రీజన్ కావాలి అంటూ ఫైర్ అయ్యాడు. ముందు చెప్పేది విను అంటూ గౌతమ్ వాదించాడు.

ఇక ప్రియాంక జైన్ ,భోలే ని నామినేట్ చేస్తూ మీలా నాకు ఇమిటేట్ చెయ్యడం నాకు రాదు సర్ అని చెప్పగానే ఇది నా డిఫెన్సె నా ఇష్టం అమ్మ అని భోలే అన్నాడు. కంటెండర్ షిప్ అనే విషయాన్ని మీరు అలా సింపుల్ గా తీసి విసిరేశారు అని ప్రియాంక రెచ్చిపోయింది. దానికి భోలే మీరు ఎప్పటికి పాజిటివ్ గా ఆలోచించరు అని అన్నాడు. ఇలా వాగ్వాదాలతో నామినేషన్స్ హౌస్ ని హీటెక్కిస్తున్నాయి.