Bigg boss 7 Telugu : ప్రియాంకపై అపవాదు… పోగొట్టుకునేందుకు ఊహించని నిర్ణయం!

. ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు ఉన్నారు. అందులో శోభా శెట్టి, శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, అమర్ దీప్, ప్రియాంక నామినేషన్ లిస్ట్ లో ఉన్నారని సమాచారం.

Written By: NARESH, Updated On : December 4, 2023 9:35 pm
Follow us on

Bigg boss 7 Telugu :  బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ లో గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఈ వారం మరో కంటెస్టెంట్ ని ఇంటికి పంపేందుకు రంగం సిద్ధమైంది. బిగ్ బాస్ రియాలిటీ షో దాదాపు ముగింపు దశకు చేరుకుంది. కాగా ఈ సీజన్ కి సంబంధించిన ఆఖరి నామినేషన్స్ రంజుగా ఉన్నాయి. అయితే ఈ ప్రక్రియలో హౌస్ మేట్స్ తాము నామినేట్ చేయాలి అనుకున్న ఇద్దరి ఫోటులు టైల్ పై ప్రింట్ చేసి దాన్ని సుత్తితో పగలగొట్టి తగు కారణాలు చెప్పాల్సి ఉంటుంది.

కాగా కంటెస్టెంట్స్ మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరిగినట్లు తెలుస్తుంది. ఇక హౌస్ లో ఉన్న స్పా బ్యాచ్, స్పై బ్యాచ్ మధ్య గట్టిగానే వాదనలు జరిగాయి. ముఖ్యంగా శోభా .. యావర్, శివాజీ తో గొడవ పడింది. అలాగే ప్రిన్స్ యావర్, అర్జున్ మధ్య కూడా హీటెడ్ ఆర్గ్యుమెంట్ నడిచిందని తెలుస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే .. ప్రియాంక తన జాన్ జిగిరి దోస్త్ అమర్ ని నామినేట్ చేయడం మరో ఎత్తు. హౌస్ లో కి అడుగు పెట్టినప్పటి నుంచి ఒకే మాట .. ఒకే ఆట అన్నట్టుగా ఉంటారు ప్రియాంక, అమర్ దీప్, శోభా శెట్టి.

గత వారం ఫినాలే రేస్ లో గాలం వెయ్ అనే టాస్క్ లో ప్రియాంక, అమర్ మధ్య కొన్ని మనస్పర్థలు వచ్చాయి. తర్వాత ప్రియాంక రేస్ లో ఓడిపోయి తన పాయింట్స్ గౌతమ్ కి ఇవ్వడంతో అమర్ హర్ట్ అయ్యాడు. ప్రియాంక ను మాటలు అన్నాడు. దీని గురించి శనివారం నాగార్జున కూడా అడిగారు. మొత్తానికి అమర్ ని నామినేట్ చేసి రివెంజ్ తీర్చుకుంది ప్రియాంక. గ్రూప్ గేమ్ ఆడుతుందనే అపవాదు పోగొట్టుకుందుకు ప్రియాంక ఊహించని నిర్ణయం తీసుకుంది.

అయితే 14వ వారానికి సంబంధించిన నామినేషన్స్ షూట్ ఆదివారమే పూర్తి అయింది. విశ్వనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ వారం అర్జున్ తప్ప మిగిలిన వారందరు నామినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు ఉన్నారు. అందులో శోభా శెట్టి, శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, అమర్ దీప్, ప్రియాంక నామినేషన్ లిస్ట్ లో ఉన్నారని సమాచారం.