Bigg Boss 7 Telugu: నేను వేసింది ఓటు కాదు పోటు… ఎలిమినేషన్ లో ప్రియాంకకు భోలే పంచ్!

ముందుగా పల్లవి ప్రశాంత్... అమర్ ని నామినేట్ చేశాడు. ఇద్దరి మధ్య వాదన జరిగింది. ఒకసారి కెప్టెన్ అయిన వాళ్ళు మళ్ళీ అవ్వకూడదని రూల్ లేదు కదా అన్న అని ప్రశాంత్ అన్నాడు.

Written By: Neelambaram, Updated On : October 30, 2023 5:47 pm
Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ఎనిమిదో వారం ఆట సందీప్ ఎలిమినేట్ అవ్వడం తో సీరియల్ బ్యాచ్ కి షాక్ తగిలింది.ఈ సారి కూడా శోభా శెట్టి ని సేవ్ చేసేశాడు బిగ్ బాస్. ఇక తొమ్మిదో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ మొదలైంది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా కంటెస్టెంట్స్ నామినేట్ చేయాలనుకునే వాళ్ళని డ్రాగన్ స్నేక్ దగ్గర నిలబెట్టాలని బిగ్ బాస్ చెప్పారు. అయితే ముందుగా పల్లవి ప్రశాంత్… అమర్ ని నామినేట్ చేశాడు. ఇద్దరి మధ్య వాదన జరిగింది. ఒకసారి కెప్టెన్ అయిన వాళ్ళు మళ్ళీ అవ్వకూడదని రూల్ లేదు కదా అన్న అని ప్రశాంత్ అన్నాడు.

దానికి ఒక సారి కెప్టెన్ అయిన వాడు.. మళ్ళీ పోటీలోకి వస్తే.. వాడు ఎవడైనా సరే తీసేస్తా అంటూ అమర్ డైలాగులు కొట్టాడు. ఆ తర్వాత ప్రియాంక… రతికని నామినేట్ చేసింది.ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. ఇక భోలే… ప్రియాంకను నామినేట్ చేశాడు. మీరు నాకు ఓటు వేశారు అని ప్రియాంక అంటే .. ఓటు కాదు పోటు వేశాను. ఓటుకు పోటు కి తేడా తెలియడం లేదా నీకు అంటూ దిమ్మతిరిగే సమాధానం చెప్పాడు భోలే. ఇద్దరు కాసేపు వాదనకు దిగారు. ఈ అగ్రెషన్ వల్లే నేను నీకు మిరపకాయల దండేసా అని భోలే చెప్పాడు.

తర్వాత అర్జున్,శోభాశెట్టి ని నామినేట్ చేశాడు. మజాక్ మజాక్ లో అంటే మనకు మజాక్ అది బయట చూసే వాళ్లకు కాదు అని అర్జున్ శోభా తో చెప్పాడు. ఇక శోభా ఎప్పటిలానే కోపంతో రగిలిపోయింది. ఈ వీక్ అది దృష్టిలో పెట్టుకుని గట్టిగా ఆడు అని అర్జున్ అన్నాడు. అవసరం లేదు నేను ఎలా ఆడాలో నాకు తెలుసు అని అంది. అర్జున్ ని తీసుకొస్తాను బిగ్ బాస్ బ్లాక్ రెడీ పెట్టుకోండి అంటూ సవాల్ చేసింది.

నామినేషన్స్ ఐతే హాట్ హాట్ గా సాగుతున్నాయి. నామినేషన్స్ వచ్చే సరికి అపరిచితుడు లా మారిపోయే ప్రశాంత్ చాలా ప్రశాంతంగా కనిపించాడు. శనివారం నాగార్జున పీకిన క్లాస్ వల్లే ఇలా మర్చిపోయినట్లున్నాడు. మరి ఎపిసోడ్ చూస్తే గాని ఎవరెవరు నామినేషన్ లో ఉన్నారో క్లారిటీ వస్తుంది.