Bigg Boss 7 Telugu: ఎపిసోడ్ హైలెట్స్: మర్డర్ మిస్టరీలో గౌతమ్-రతిక రొమాన్స్… ప్రశాంత్ ని బంధించిన శివాజీ

ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అమర్, అర్జున్ అందరినీ ప్రశ్నించారు. సెక్యూరిటీ గార్డుగా ఉన్న రతిక తిక్క తిక్క సమాధానాలతో పోలీసులను విసిగించింది. రతిక, గౌతమ్ అందరి బ్యాగ్ లు వెతికారు.

Written By: NARESH, Updated On : November 23, 2023 10:21 am

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: ఈ వారానికి గానూ కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ డ్రామా ప్లాన్ చేశాడు. బిగ్ బాస్ వైఫ్ ని ఎవరో మర్డర్ చేశారు. అది ఎవరో కనిపెట్టాలని పోలీసులు అధికారులకు చెప్పాడు. ఇక బిగ్ బాస్ వైఫ్ వద్ద పని చేసే వాళ్ళుగా శివాజీ, ప్రశాంత్, ప్రియాంక, రతిక, గౌతమ్, యావర్ ఉన్నారు. పోలీసులుగా అర్జున్, అమర్ వ్యవహరిస్తున్నారు. అశ్విని, శోభ ఈ మర్డర్ న్యూస్ కవర్ చేసే రిపోర్టర్స్ గా ఉన్నారు.

ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అమర్, అర్జున్ అందరినీ ప్రశ్నించారు. సెక్యూరిటీ గార్డుగా ఉన్న రతిక తిక్క తిక్క సమాధానాలతో పోలీసులను విసిగించింది. రతిక, గౌతమ్ అందరి బ్యాగ్ లు వెతికారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య రొమాన్స్ చోటు చేసుకుంది. ఇద్దరూ రహస్యంగా ఓ చోట చేరి సన్నిహితంగా వ్యవహరించారు. ఇక ప్రశాంత్ ని మర్డర్ చేయాలని బిగ్ బాస్ శివాజీని ఆదేశించాడు. శివాజీ పల్లవి ప్రశాంత్ ని స్టార్ రూమ్ లో లాక్ చేశాడు.

అతని మొక్కను పోస్ట్ బాక్స్ లో పెట్టాడు. అనూహ్యంగా అమర్-శోభ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నీ పని నాకు నచ్చడం లేదని శోభ అనడంతో అమర్ తీసుకోలేకపోయాడు. తన కోపం ఆపులేక చేతిలోని లాఠీ విసిరి కొట్టాడు. అశ్వినితో కూడా అమర్ కి గొడవైంది. పల్లవి ప్రశాంత్ ని స్టార్ రూమ్ లో లాక్ చేయడంతో అందరూ వెతికారు. శివాజీ, ప్రశాంత్ ని మర్డర్ చేసిన విషయం తెలిసిపోయింది.

ప్రశాంత్ మరణించిన నేపథ్యంలో దెయ్యంగా హౌస్లో తిరగాలని బిగ్ బాస్ చెప్పాడు. శివాజీ తన మొక్కను వెతుక్కోవడం మొదలు పెట్టాడు. ఇలాంటి ఆసక్తికర పరిణామాలతో నిన్న ఎపిసోడ్ ముగింసింది. ఇక ఈ వారం ఎలిమినేషన్ లో 8 మంది ఉన్నారు. డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు. దీంతో ఎవరు ఎలిమినేట్ అవుతారనే చర్చ ఉత్కంఠ నడుస్తుంది. రతిక, అశ్విని డేంజర్ జోన్లో ఉన్నారని సమాచారం.