Bigg Boss 7 Telugu: ఈసారి ఎవరూ కాపాడలేరు… బిగ్ బాస్ హౌస్ నుండి వారిద్దరూ అవుట్!

మంగళవారం రాత్రి ఓటింగ్ లైన్స్ ఓపెన్ కానున్నాయి. ఎవరికి ఎక్కువ ఓట్లు పడతాయి? ఎవరికి తక్కువ ఓట్లు పడతాయి? అనేది ఒక అంచనా వేయవచ్చు. ఖచ్చితంగా శివాజీ, పల్లవి ప్రశాంత్ టాప్ లో ఉంటారు.

Written By: NARESH, Updated On : November 21, 2023 3:49 pm
Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకు చేరుకుంది. మరో మూడు నాలుగు వారాల గేమ్ మాత్రమే మిగిలి ఉంది. హౌస్లో 10 మంది హౌస్ మేట్స్ ఉన్నారు. ఈ ఆదివారం గౌతమ్, అశ్వినిలలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండగా… నాగార్జున చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చాడు. ఈ వారం ఎలిమినేషన్ లేదన్నారు. యావర్ తాను గెలుచుకున్న అవిక్షన్ పాస్ తిరిగి వెనక్కి ఇచ్చేశాడు. అందుకే ఎలిమినేషన్ రద్దు అయ్యిందని నాగార్జున చెప్పారు. అయితే నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ అన్నారు.

ఈ వారానికి గానూ 8 మంది నామినేట్ అయినట్లు సమాచారం. కెప్టెన్ గా ఉన్న ప్రియాంక నామినేషన్స్ లో లేరు. అలాగే శోభా శెట్టిని ఎవరూ నామినేట్ చేయలేదట. ఈ క్రమంలో మిగిలిన శివాజీ, ప్రశాంత్, అమర్, యావర్, అర్జున్, గౌతమ్, అశ్విని, రతిక నామినేట్ అయ్యారట. మరి నాగార్జున చెప్పిన ప్రకారం వీరిలో తక్కువ ఓట్లు వచ్చిన ఇద్దరు ఎలిమినేట్ కానున్నారు.

మంగళవారం రాత్రి ఓటింగ్ లైన్స్ ఓపెన్ కానున్నాయి. ఎవరికి ఎక్కువ ఓట్లు పడతాయి? ఎవరికి తక్కువ ఓట్లు పడతాయి? అనేది ఒక అంచనా వేయవచ్చు. ఖచ్చితంగా శివాజీ, పల్లవి ప్రశాంత్ టాప్ లో ఉంటారు. స్వల్ప ఓటింగ్ తేడాతో యావర్, అమర్, అర్జున్, గౌతమ్ మిగతా స్థానాల్లో ఉంటారు. డేంజర్ జోన్లో అశ్విని, రతిక ఉంటారు అనడంలో సందేహం లేదు. కాబట్టి వచ్చే వారం ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ చేస్తే వీరిద్దరూ అవుట్ అంటున్నారు.

రతిక, అశ్వినిలను ఎలిమినేట్ చేస్తే బిగ్ బాస్ హౌస్లో ఇద్దరు లేడీ కంటెస్టెంట్స్ మాత్రమే ఉంటారు. సీరియల్ బ్యాచ్ కి చెందిన ప్రియాంక, శోభ గట్టి హామీలతో హౌస్లో అడుగుపెట్టారని సమాచారం. ముఖ్యంగా శోభపై చాలా వ్యతిరేకత ఉంది. ఆమె ఇప్పటికే ఎలిమినేట్ కావాలి. కానీ కాపాడుతూ వస్తున్నారు. వీరిద్దరూ ఫైనల్ లో ఉన్నా ఆశ్చర్యం లేదు. ప్రియాంక అయితే గ్యారంటీగా ఫైనల్ కి చేరుతుంది