Bigg Boss 7 Telugu: ఎపిసోడ్ హైలెట్స్: అది ఊడిపోకుండా చూస్కో… గౌతమ్ పరువు తీసిన పల్లవి ప్రశాంత్

రతికని నామినేట్ చేశాడు ప్రశాంత్. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి పల్లవి ప్రశాంత్ .. ఆలోచన, మేధావితనం ఇది అంటూ డైలాగ్ కొట్టింది రతిక.

Written By: NARESH, Updated On : November 21, 2023 9:21 am

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ హీటెక్కిస్తున్నాయి. కంటెస్టెంట్స్ మధ్య గొడవలతో పాటు కాస్త కామెడీగా నామినేషన్ ప్రక్రియ సాగుతుంది.ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో ప్రశాంత్ రతికకి , గౌతమ్ కి ఇచ్చి పడేశాడు. అయితే ముందుగా నామినేట్ చేయడానికి వచ్చిన రతిక .. దా అంటూ ప్రశాంత్ ని పిలిచింది. ప్రశాంత్ సిగ్గుపడుతూ తలదించుకున్నాడు. రతిక నామినేషన్ రీజన్ చెప్పింది. దాంతో ‘ నీకు అన్యాయం జరిగిందని అనిపిస్తుంది అంతే .. అది నీ తప్పు నా తప్పు కాదు అంటూ చెప్పాడు ప్రశాంత్.

తర్వాత అమర్ ని నామినేట్ చేసింది రతిక. ‘ 15 వ వారం ఎంతమంది ఉంటారు’ అని అడిగింది. నాకు తెలియదు అంటూ అమర్ సింహం బొమ్మ తో ఆడుకుంటూ కామెడీ చేశాడు. నీకు ఎం తెలియదు అందుకే చెప్తున్నా అంటూ రతిక.. మళ్ళీ ఇది రిపీట్ చేయొద్దు అంటూ సీరియస్ గా చెప్పింది. తర్వాత గౌతమ్ ని నామినేట్ చేశాడు ప్రశాంత్. నువ్వు అలా మాట్లాడాలని అనుకుంటే నేను మాట్లాడడానికి సిద్ధంగా లేను అంటూ గౌతమ్ అన్నాడు.

‘ నాకు పంచె ఆనవాయితీ లెక్క నీకు కూడా నన్ను నామినేట్ చేయడం ఆనవాయితీ అంటూ గౌతమ్ డైలాగ్ వేశాడు. ‘ ఆ పంచె ఊడిపోకుండా కాపాడుకో అంటూ దిమ్మ తిరిగే పంచ్ ఇచ్చాడు ప్రశాంత్. ఇక గౌతమ్ ఎక్కువ తక్కువ మాట్లాడకు అంటూ అరిచాడు. బారాబర్ మాట్లాడతా .. ఇలానే మాట్లాడతా అంటూ ప్రశాంత్ ఇచ్చి పడేశాడు. దీంతో ‘ పంచె అనేది తెలుగోడి సంస్కృతి .. దాని గురించి మాట్లాడటం మంచిది కాదు ఫైర్ అయ్యాడు గౌతమ్.

ఇక తర్వాత రతికని నామినేట్ చేశాడు ప్రశాంత్. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి పల్లవి ప్రశాంత్ .. ఆలోచన, మేధావితనం ఇది అంటూ డైలాగ్ కొట్టింది రతిక. కానీ ప్రశాంత్ చివర్లో కొట్టిన డైలాగ్ హైలెట్ గా నిలిచింది. అక్కా .. సింహానికి ఆకలి ఎక్కువ .. పల్లవి ప్రశాంత్ కి పవర్ ఎక్కువ .. సింహం ఆకలికి వేటాడతది .. పల్లవి ప్రశాంత్ ఆకలికి ఆటాడతాడు అంటూ అదిరిపోయే డైలాగ్ కొట్టాడు. వెంటనే రతిక కట్ .. బావుంది డైలాగ్ అంటూ వెటకారం చేసింది. థాంక్యూ అంటూ కూల్ గా చెప్పాడు ప్రశాంత్.

నామినేషన్ ప్రక్రియ ఇంకా ముగియలేదు… ఎవరు ఎవరిని నామినేట్ చేశారో చూద్దాం..
అమర్ దీప్- యావర్, రతిక
గౌతమ్- ప్రశాంత్, శివాజీ
రతిక-అమర్ దీప్, ప్రశాంత్
అర్జున్- యావర్, శివాజీ
ప్రశాంత్-గౌతమ్, రతికలను నామినేట్ చేశారు. ఎవరినీ నామినేట్ చేయని కారణంగా అశ్విని సెల్ఫ్ నామినేట్ అయ్యింది. మంగళవారం ఎపిసోడ్ తో నామినేషన్స్ ముగియనున్నాయి.