Bigg boss Telugu 5 : తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ ఫీవర్ పీక్ స్టేజ్ కు చేరింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో డిస్కషన్ నడుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన నాలుగు సీజన్లు బంపర్ హిట్ కొట్టడంతో.. ఐదో సీజన్ పై ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అయింది. ఈ సీజన్ ఆరంభానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండడంతో.. ఈ సారి హౌజ్ లోకి అడుగు పెట్టేది ఎవరా? అనే చర్చ జోరుగా సాగుతోంది. దీంతో.. కంటిస్టెంట్ల మీదనే అందరూ ఫోకస్ పెట్టారు. అయితే.. షో ఆరంభం కాకుండానే లీకులు బయటకు రావడం ఆసక్తిని మరింత పెంచేస్తోంది.
కంటిస్టెంట్ల పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. హీరోయిన్ ఇషా చావ్లా, నటీమణులు శ్వేతా వర్మ, ప్రియ, లహరి షారి, యాంకర్లు రవి, వర్షిణి, జబర్ధస్త్ ప్రియాంక, సిరి హన్మంతు, సింగర్ రామ చంద్ర, దీపక్ సరోజ, 7ఆర్ట్స్ సరయు, షణ్ముఖ్ జస్వంత్, నటరాజ్ మాస్టర్, టీవీ యాక్టర్లు సన్నీ, మానస్ షా, కార్తీక దీపం ఫేమ్ ఉమాదేవీ, మోడల్ జశ్వంత్, ఆర్జే కాజల్, లమరి షారి, యూట్యూబర్ లోబో వంటివారు ఉన్నారు. వీరిలో కొందరిని స్టాండ్ బైగా కూడా ఉంచినట్టుగా తెలుస్తోంది.
అయితే.. గత సీజన్ ప్రారంభంలో ఇద్దరు కంటిస్టెంట్లను సీక్రెట్ రూమ్ లోకి పంపించిన సంగతి తెలిసిందే. సోహైల్, అరియానా గ్లోరీని రహస్య గదిలోకి పంపించారు. దాంతో.. గేమ్ ఆరంభంలోని ట్విస్ట్ కొనసాగించారు. ఇప్పుడు ఐదో సీజన్లోనూ ఇదే పద్ధతిని కొనసాగించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం ఇప్పటికే బయటకు వచ్చింది.
అందుతున్న సమాచారం ప్రకారం.. ఐదో సీజన్ ఆరంభంలో ఇద్దరు కంటిస్టెంట్లను సీక్రెట్ రూమ్ లోకి తోలబోతున్నారు. వారిలో షణ్ముఖ్ జస్వంత్ తోపాటు మరో లేడీ కంటిస్టెంట్ ఉండనున్నట్టు సమాచారం. సోసల్ మీడియాలో ఆమెకు కూడా మంచి ఫాలోయింగ్ ఉండడంతో.. వీరిద్దరినీ సీక్రెట్ రూమ్ లోకి పంపబోతున్నారని తెలుస్తోంది. మరి, ఏం జరుగుతోంది? ఈ ప్రచారంలో ఉన్న వాస్తవం ఎంత అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.