Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుపాటి కలయికలో వస్తున్న మల్టీ స్టారర్ చిత్రం భీమ్లా నాయక్. మళయాలి చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్గా ఈ సినిమా రూపొందిస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి కొత్త అప్డేట్ వినిపిస్తోంది. ఈ చిత్రంలోని పోరాట సన్నివేశాలను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ సీన్స్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేయనున్నారట.

ఇటీవలే విడుదలైన టీజర్ పవన్ అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. మరోవైపు, సగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో పవన్ కొత్త లుక్లో కనిపించపోతున్నట్లు తెలుస్తోంది.
ఏది ఏమైనా క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తుడగా.. నవీన్ నూలి ఎడిటర్ గా , రవి కె చంద్రన్ కెమెరామెన్గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన నిత్యా మీనన్ నటించనుంది. మరోవైపు తెలుగు నేటివిటికి తగ్గట్లు ఈ సినిమా కథలో త్రివిక్రమ్ కొన్ని మార్పులు చేశారు.