Akhanda Movie: భారీ ధరకు అమ్ముడుపోయిన… బాలయ్య “అఖండ” నైజాం రైట్స్

Akhanda Movie: నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమా “అఖండ”. సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబోలో వస్తున్న ఈ మూడో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా… శ్రీకాంత్ విలన్‌గా చేస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుందని మూవీ యూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ […]

Written By: Raghava Rao Gara, Updated On : October 17, 2021 10:34 am
Follow us on

Akhanda Movie: నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమా “అఖండ”. సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబోలో వస్తున్న ఈ మూడో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా… శ్రీకాంత్ విలన్‌గా చేస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుందని మూవీ యూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా… ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నైజాం రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయని టాక్ నడుస్తుంది.

ఈ చిత్రం నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఏకంగా 19కోట్లకు కొనుగోలు చేశారని సమాచారం. ఈ సినిమా ఆంధ్ర హక్కులు రూ. 35 కోట్లు, సీడెడ్ రీజియన్ హక్కులు రూ .12 కోట్లకు అమ్ముడు పోయాయని సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అయితే దీని గురించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఒక పాత్రలో అఘోరాగా, మరో పాత్రలో రాయలసీమ వ్యక్తిగా కనిపించబోతున్నారు.

త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర నిర్మాతలు వెల్లడించారు. తమన్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు.  ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, ప్రోమో లకు మంచి స్పందన వస్తుండడంతో ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించబోతున్నారు. దీంతో పాటు ఆహా ఓటిటీ లో అన్ స్టాపబుల్ అనే టాక్ షో కు బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.