Priyamani: అట్లీ నన్ను మోసం చేశాడు… జవాన్ డైరెక్టర్ పై ప్రియమణి కీలక వ్యాఖ్యలు

జవాన్ సక్సెస్ కావడంతో ఆ టీమ్ తో ఒక భేటీ జరిగింది. ఇందులో ప్రియమణి మాట్లాడుతూ జవాన్ సినిమాలో ఒక అవకాశం అనగానే ఏదో క్యామియో రోల్ అయివుంటుందని అనుకున్నాను కానీ షారుఖ్ టీం లో ముఖ్యమైన పాత్ర అవుతుందని అనుకోలేదు.

Written By: Shiva, Updated On : September 13, 2023 1:23 pm

Priyamani

Follow us on

Priyamani: ప్రియమణి అటు తెలుగు, ఇటు తమిళ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని తమిళ చిత్రం పరుత్తివీరన్ అనే సినిమాతో ఏకంగా ఉత్తమ నటి అవార్డు దక్కించుకుంది. ఇక ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో నటిస్తూ జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది ప్రియమణి. రీసెంట్ గా వచ్చిన జవాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ సరసన మంచి పాత్రలో నటించి మెప్పించింది. ప్రియమణి పెళ్ళైన నాటి నుండి తన వయస్సుకు తగ్గ పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది.

జవాన్ సక్సెస్ కావడంతో ఆ టీమ్ తో ఒక భేటీ జరిగింది. ఇందులో ప్రియమణి మాట్లాడుతూ జవాన్ సినిమాలో ఒక అవకాశం అనగానే ఏదో క్యామియో రోల్ అయివుంటుందని అనుకున్నాను కానీ షారుఖ్ టీం లో ముఖ్యమైన పాత్ర అవుతుందని అనుకోలేదు. ఈ సినిమాకు అట్లీ దర్శకుడు అని చెప్పగానే మరో మాట లేకుండా ఒప్పుకున్నాను. ఒకసారి జూమ్ కాల్ లో మాట్లాడుతున్నప్పుడు ఆర్య , అట్లీ ఉన్నారు. అట్లీ నా ఫ్రెండ్ అంటూ ఆర్య పరిచయం చేసి వెళ్ళిపోయాడు.

నిజానికి ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను ఈ సినిమా లో నటిస్తున్న విషయం బయటకు రాగానే చాలామంది ప్రియమణి అంటే ఏదో ఐటమ్ సాంగ్ లో నటిస్తుందిలే అని అనుకున్నారు. కానీ నేను వాటిని పట్టించుకోలేదు. ఎందుకంటే నా పాత్ర ఏమిటో నాకు బాగా తెలుసు. ఇలాంటి మాటలు పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేము. అయితే ఒక విషయంలో మాత్రం దర్శకుడు అట్లీ నన్ను మోసం చేశాడు.

ఈ సినిమా తమిళ వెర్షన్ లో ఒక గెస్ట్ రోల్ లో విజయ్ , తెలుగు వెర్షన్ లో ఎన్టీఆర్ నటించబోతున్నారనే ప్రచారం బాగా జరిగింది. విజయ్ ఇందులో నటిస్తున్నాడా ? అని నేను అట్లీ ని అడిగితే నటింపజేస్తే పోతుంది కదా అని అన్నాడు. దీనితో ఎలాగైనా విజయ్ సరసన ఒక్క సీన్ లో అయిన కనిపించే చేయాలనీ దర్శకుడిని అడిగాను. కానీ ఈ సినిమాలో విజయ్ నటించలేదు, ఎన్టీఆర్ నటించలేదు అంటూ ప్రియమణి చెప్పుకొచ్చింది.