భర్తను ఏడిపించిన స్టార్ హీరోయిన్

చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్ తో ప్రపంచం భయాందోళనకు గురవుతోంది. కరోనా దేశంలోకి ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తోంది. ఏప్రిల్ 15నుంచి రెండో విడుత లాక్డౌన్ కొనసాగుతున్న సంగతి తెల్సిందే. ఈ లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్లులు, క్రీడలు వాయిదా పడ్డాయి. దీంతో ఇండియన్ క్రికెటర్ కోహ్లీ, స్టార్ హీరోయిన్ అనుష్క శర్మకు సరదాగా గడిపేందుకు సమయం దొరికింది. వీరిద్దరు క్వారంట్లోనూ ఉంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా అనుష్క తన […]

Written By: Neelambaram, Updated On : April 18, 2020 12:12 pm
Follow us on


చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్ తో ప్రపంచం భయాందోళనకు గురవుతోంది. కరోనా దేశంలోకి ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తోంది. ఏప్రిల్ 15నుంచి రెండో విడుత లాక్డౌన్ కొనసాగుతున్న సంగతి తెల్సిందే. ఈ లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్లులు, క్రీడలు వాయిదా పడ్డాయి. దీంతో ఇండియన్ క్రికెటర్ కోహ్లీ, స్టార్ హీరోయిన్ అనుష్క శర్మకు సరదాగా గడిపేందుకు సమయం దొరికింది. వీరిద్దరు క్వారంట్లోనూ ఉంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా అనుష్క తన భర్త కోహ్లీని ఆటపట్టించే వీడియోను తన ఇన్ స్ట్రాగ్రామ్లో పోస్టు చేసింది. ఈ వీడియోను అభిమానులు వైరల్ చేస్తున్నారు.

‘ఏయ్ కోలీ.. చౌకామార్.. చౌకా.. క్యా కర్రా రే’ అంటూ అనుష్క క్లోహ్లీని ఆటపట్టింది. ఆమె చేసిన పనికి కోహ్లీ బిత్తర చూపులు చూస్తూ గమ్మున ఉండిపోయాడు. ఈ వీడియోను అనుష్కనే స్వయంగా తన ఇన్ స్ట్రాగ్రామ్లో పోస్టు చేసింది. ఈ వీడియో ఫన్నీగా ఉండటంతో అభిమానులు వైరల్ చేస్తున్నారు. కోహ్లీ క్రికెట్ గ్రౌండ్లో లక్షలాది మంది ఫ్యాన్స్ కు దూరమయ్యాడని పేర్కొంది. అభిమానులు ప్రత్యేకంగా అరిచే అరుపులు మిస్ అవుతుండటంతో ఆయనకు ఆ అనుభవాన్ని తాను గుర్తు చేసినట్లు ట్వీట్ చేసింది అనుష్క. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో అందరినీ ఆకట్టుకుంటోంది.