
దర్శకధీరుడు రాజమౌళి ‘బాహుబలి’ తర్వాత తీస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఈ ప్యాన్ ఇండియా మూవీపై దేశవ్యాప్తంగా బోలెడు అంచనాలున్నాయి. కొమురం భీం, అల్లూరి సీతారామరాజుల జీవిత చరిత్రను కల్పిత కథగా మార్చి తీస్తున్న ఈ మూవీపై దేశవ్యాప్తంగా అంచనాలున్నాయి.
ఈ క్రమంలోనే కరోనా కల్లోలంతో వాయిదా పడుతూ షూటింగ్ గ్యాప్ లకు గురి అవుతున్న ఈ సినిమా ఎంతవరకు వచ్చింది.? ఎంత పూర్తి అయ్యిందనే దానిపై క్లారిటీ లేదు.
కానీ తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఎన్టీఆర్, రాంచరణ్ బైక్ రైడ్ చేస్తున్న ఫొటోను షేర్ చేసి ఈ మేరకు రాజమౌళి టీం ట్వీట్ చేసింది.
‘రెండు పాటల చిత్రీకరణ మినహా షూటింగ్ మొత్తం పూర్తయ్యిందని.. రెండు భాషల్లో రాంచరణ్, ఎన్టీఆర్ డబ్బింగ్ కూడా చెప్పారని’ ఆర్ఆర్ఆర్ చిత్రబృందం తెలిపింది. ప్రస్తుతం రెస్ట్ ఇచ్చామని త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు.దీన్ని బట్టి దసరాకు, దీపావళికి, సంక్రాంతికైనా సినిమాను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Moving at a rapid pace 🤘🏻
Except for two songs, we are done with the shoot. #RRRMovie@tarak9999 & @alwaysramcharan have completed the dubbing for 2 languages and will wind up the rest soon. 🔥🌊 pic.twitter.com/6g1h5yTQhK— RRR Movie (@RRRMovie) June 29, 2021